AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఫోర్జరీ సంతకాలతో రూ. 55 కోట్లు స్వాహా.. చీటింగ్ కేసులో సినీ హీరో అరెస్ట్‌.. రిమాండ్‌కు తరలింపు

సినిమా ఇండస్ట్రీలో హీరోగా చెలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్న ఒకరిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tollywood: ఫోర్జరీ సంతకాలతో రూ. 55 కోట్లు స్వాహా.. చీటింగ్ కేసులో సినీ హీరో అరెస్ట్‌.. రిమాండ్‌కు తరలింపు
Naveen Reddy
Basha Shek
|

Updated on: Feb 04, 2023 | 5:00 PM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోగా చెలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్న ఒకరిని  హైదరాబాద్ సీసీఎస్  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ స్క్వేర్ కంపెనీ లో డైరెక్టర్‌గా పని చేసిన నవీన్ రెడ్డి కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టాడు. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు సమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్ రెడ్డిపై ఎస్  స్క్వేర్ కంపెనీ డైరెక్టర్లు ఫిర్యాదు చేశారు. ఈమేరకు సినీ హీరో అట్లూరి నవీన్ రెడ్డి పై సెక్షన్లు 420, 465,468,471 r/w 34 IPC కింద కేసు నమోదు చేశారు సీసీఎస్‌ పోలీసులు. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు నవీన్‌ను చర్లపల్లి జైలుకు రిమాండ్ తరలించారు. కాగా మోసం చేసిన డబ్బులతో నవీన్‌ జల్సాలు చేశాడని బాధితులు చెబుతున్నారు. అలాగే తనే హీరోగా నోబడీ అనే సినిమా కూడా తీశాడు. సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కోడిపుంజులగూడెం కు చెందిన నవీన్ రెడ్డి పై గతంలో బైక్ దొంగతనం కేసులు కూడా ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..