14 పాయింట్లతో అమెరికాకు ఇరాన్ తాజా ప్రతిపాదన!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ 14 పాయింట్లతో కూడిన సరికొత్త ప్రతిపాదనలను అమెరికా ముందుంచింది. బలగాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత వంటి డిమాండ్లు ఇందులో ఉన్నాయి. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రతిపాదనలపై సందేహం వ్యక్తం చేయడంతో పశ్చిమాసియా భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.
అమెరికా, ఇరాన్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతలకు స్వస్తి పలకడానికి ఇరాన్ ముందుకు వచ్చింది. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే లక్ష్యంతో ఇరాన్ 14 పాయింట్లతో కూడిన ప్రతిపాదనలను అమెరికాకు సమర్పించింది. పాకిస్తాన్ దౌత్య మార్గాల ద్వారా పంపిన ఈ ప్రతిపాదనలలో బలగాల ఉపసంహరణ, భద్రతా హామీలు, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, ఆంక్షల ఎత్తివేత, హర్మూజ్ జలసంధి దిగ్బంధం తొలగింపు, యుద్ధ నష్టపరిహారం వంటి కీలక డిమాండ్లు ఉన్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా, శాశ్వత పరిష్కారం కావాలని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు.
మరిన్ని వీడియోల కోసం :
పూరీ, సురేందర్ రెడ్డి కెరీర్ను నిలబెట్టేదెవరు..?
ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారుగా.. ఈసారి బాక్సులు బద్ధలే..!
టికెట్లు, థియేటర్లు.. టాలీవుడ్లో కొత్త గొడవలు..!
సెంచరీకి చేరువలో సంచలన ప్రయోగం
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత

