AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayasudha: జయసుధ చెల్లెలు సుభాషిణి కూతురు హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా ?..

తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో నటించారు. ప్రస్తుతం ఆమె మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నటిస్తుండగా.. ఇటీవలే విడుదలైన మళ్లీ పెళ్లి చిత్రంలో కనిపించారు. అయితే జయసుధ చెల్లెలు కూడా నటి అన్న సంగతి చాలా మందికి తెలియదు. కానీ ఆమె తన అక్కలాగే ఓ గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.

Jayasudha: జయసుధ చెల్లెలు సుభాషిణి కూతురు హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా ?..
Jayasudha
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2023 | 9:28 PM

Share

తెలుగు ప్రేక్షకులకు సహజనటి జయసుధ సుపరిచితమే. సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు అలనాటి హీరోలందరి జోడిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత తల్లిగా.. వదినగా.. అక్కగా ఎన్నో పాత్రలు పోషించారు. వెండితెరపై దాదాపు 50 ఏళ్లుగా ఆమె నట ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఆమె 300కు పైగా చిత్రాల్లో నటించి అలరించారు. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో నటించారు. ప్రస్తుతం ఆమె మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నటిస్తుండగా.. ఇటీవలే విడుదలైన మళ్లీ పెళ్లి చిత్రంలో కనిపించారు. అయితే జయసుధ చెల్లెలు కూడా నటి అన్న సంగతి చాలా మందికి తెలియదు. కానీ ఆమె తన అక్కలాగే ఓ గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.

తనే నటి సుభాషిణి. బుల్లితెరపై నాగాస్త్రం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత సుందరకాండ చిత్రంలో నటించింది. అరుంధతి చిత్రంలో సోనూసూద్ తల్లిపాత్రలో నటించింది సుభాషిణి. అయితే ఆమెకు వెండితెరపై అంతగా గుర్తింపు రాలేదు. దాదాపు 12 సినిమాల్లో నటించింది. ఇక సుభాషిణి కూతురు సైతం ఒకప్పుడు హీరోయిన్. కానీ కేవలం ఒకే ఒక్క సినిమా చేసింది. ఆమె పేరు ప్రియాంక.

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు రామ్ శంకర్ ప్రధాన పాత్రలో నటించిన 143 చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ ప్రియాంకు అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. 2012లో పెళ్లి చేసుకున్న ఆమె ప్రస్తుతం ఫ్యామిలీతో సమయం గడుపుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.