AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virupaksha Director: శిష్యూడికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన సుక్కు.. ‘విరూపాక్ష’ డైరెక్టర్‏ జీవితంలో మర్చిపోలేని క్షణం..

వలం థియేటర్లలోనే కాకుండా.. ఓటీటీలోనూ అదరగొట్టింది. చాలా కాలం తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ హరర్ చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకువచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు కార్తిక్. ప్రేక్షకులతోపాటు.. సినీ విమర్శకులు సైతం కార్తీక్ టేకింగ్ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకుడు సుకుమార్ తన శిష్యుడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ కార్తీక్ దండు ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.

Virupaksha Director: శిష్యూడికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన సుక్కు.. 'విరూపాక్ష' డైరెక్టర్‏ జీవితంలో మర్చిపోలేని క్షణం..
Sukumar, Karthik
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2023 | 2:50 PM

Share

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డైరెక్టర్ సుకుమార్ శిష్యూలు సత్తా చాటుతున్నారు. సుక్కు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేసి.. ఆ తర్వాత మెగాఫోన్ పట్టి అద్భుతమైన సినిమాలను తీస్తున్నారు. ఇప్పటికే ఉప్పెన సినిమాతో తొలిరోజే సెన్సెషన్ క్రియేట్ చేశాడు బుచ్చిబాబు సన. ఇక ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన దసరా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల విరూపాక్ష సినిమాతో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ కార్తీక్ దండు. సూప్రీమ్ హీరో సాయ్ ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కేవలం థియేటర్లలోనే కాకుండా.. ఓటీటీలోనూ అదరగొట్టింది. చాలా కాలం తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ హరర్ చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకువచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు కార్తిక్. ప్రేక్షకులతోపాటు.. సినీ విమర్శకులు సైతం కార్తీక్ టేకింగ్ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకుడు సుకుమార్ తన శిష్యుడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ కార్తీక్ దండు ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.

“విరూపాక్ష సినిమా నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఈ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు నా గురువు సుకుమార్ సార్, మా హీరో సాయి ధరమ్ తేజ్, చిత్రనిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేస్తూ.. బెంజ్ కారుతోపాటు.. తమ గురువు సుకుమార్ ఫోటోస్ షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రం అతడికి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. అంతేకాకుండా.. ఇప్పటివరకు అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇందులో రాజీవ్ కనకాల, సోనియా సింగ్, శ్యామల, రవికృష్ణ, సునీల్ కీలకపాత్రలలో నటించారు. ఇక ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.