Chaavu Kaburu Challaga : చావుకబురు చల్లగా లో చాలా చేంజెస్ చేశారట.. కారణం ఇదే..
యంగ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు.
Chaavu Kaburu Challaga : యంగ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ, మల్లిగా లావణ్య ఆకట్టుకుంటున్నారు. సినిమా విడుదలకు ముందు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమా పైన ఆసక్తిని పెంచాయి. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా రిలీజ్ అవ్వనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఓటీటీ ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేసే విధంగా సినిమా లో మార్పులు చేర్పులు చేసి తీసుకు వస్తున్నట్లుగా ఆహా వారు చెబుతున్నారు. ఈనెల 23న ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్దం అయిన ‘చావు కబురు చల్లగా’ సినిమా తప్పకుండా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
అప్పుడు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్లో చాలా మార్పులు చూసాను.. నేను చూసిన కళ్యాణ్ వేరు.. ప్రకాశ్ రాజ్..
Sehari Movie: ఆకట్టుకుంటున్న సెహరి టీజర్… బాలయ్యను వాడేస్తున్న చిత్రయూనిట్…
Vishwak Sen: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’.. న్యూ ప్రాజెక్ట్ను ప్రారంభించిన విశ్వక్ సేన్..