AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు నెట్టింట గ్లామర్ సెన్సెషన్..

ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించి తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన తారలు చాలా మంది ఉన్నారు. చిన్నప్పుడే అద్భుతమైన నటనతో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చదువు దృష్ట్యా సినిమాలకు బ్రేక్ తీసుకున్న స్టార్స్.. ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. హీరోహీరోయిన్లుగా వెండితెరపై సందడి చేస్తున్నారు. అందులో ఈ చిన్నారి కూడా ఉంది.

Tollywood: చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు నెట్టింట గ్లామర్ సెన్సెషన్..
Actress New
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2024 | 4:46 PM

Share

ఇటీవల కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోలు వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. సినిమా సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు.. వారి బాల్యం గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హీరోయిన్స్ లేటెస్ట్ ఫొటోలతో పాటు చైల్డ్ హుడ్ ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైన ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో నిలబడిన ఆ చిన్నారిని గుర్తుపట్టారా.. ? తెలుగులో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దేవుళ్లు సినిమాలో బాలనటిగా కనిపించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా కనిపిస్తుంది. అంతేకాదు.. ఇప్పుడు నెట్టింట అందాలతోనూ కవ్విస్తుంది. ఇంతకీ ఆ చిన్నారిని ఇప్పుడు చూస్తే మీరు అసలు నమ్మలేరు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ అంజి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆ చిన్నారి పేరు నిత్యా శెట్టి.

ఈ సినిమానే కాకుండా డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవుళ్లు సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. అందులో తన తమ్ముడితో కలిసి దేవాలయాలు అన్ని తిరిగే ఆ పాపే ఈ చిన్నారి. అంజి సినిమా తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించిన ఆ చిన్నారి.. చదువుల కోసం సినిమాలకు బ్రేక్ తీసుకుంది.

కొంత కాలం తర్వాత పిట్టకథ అనే సినిమాతో హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల మెగా డాటర్ నిహారిక నిర్మించిన హాల్లో వరల్డ్ వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఈ బ్యూటీ ఇప్పుడు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.