AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ‘బ్రో’ నుంచి క్రేజీ అప్డేట్.. స్పెషల్ సాంగ్‏లో మెరవనున్న బాలీవుడ్ బ్యూటీ..

తమిళ చిత్రం వినోదయ సీతమ్ యొక్క అధికారిక రీమేక్ అయిన ఈ చిత్రానికి నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన పవన్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pawan Kalyan: 'బ్రో' నుంచి క్రేజీ అప్డేట్.. స్పెషల్ సాంగ్‏లో మెరవనున్న బాలీవుడ్ బ్యూటీ..
Bro Movie
Rajitha Chanti
|

Updated on: Jun 05, 2023 | 7:18 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే బ్రో షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్.. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు బ్రో మూవీ డబ్బింగ్ వర్క్స్ ఇటీవలే షూరు అయ్యాయి. ఇందులో మెగా మేనల్లుడు సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా జూలై 28, 2023న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. తమిళ చిత్రం వినోదయ సీతమ్ యొక్క అధికారిక రీమేక్ అయిన ఈ చిత్రానికి నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన పవన్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డెట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. అదెంటంటే.. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని సమాచారం. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయం పై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఊర్వశి రౌతేలా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, అఖిల్ ఏజెంట్‌ చిత్రాలలో ప్రత్యేక పాటలు చేసింది.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా…ఇటీవల రామ్ – బోయపాటి సినిమాలో కూడా ఒక డ్యాన్స్ నంబర్ కోసం షూట్ చేసింది. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై TG విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.