Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharwanand: మూడుముళ్లతో ఒక్కటైన శర్వానంద్, రక్షితా రెడ్డి.. ఫోటోస్ వైరల్..

సుమారు రెండు రోజులపాటు జరిగిన ఈ పెళ్లి వేడుకలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సిద్ధార్థ్, అదితి రావు హైదరీతాపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నూతన వధూవరులకు నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Sharwanand: మూడుముళ్లతో ఒక్కటైన శర్వానంద్, రక్షితా రెడ్డి.. ఫోటోస్ వైరల్..
Sharwanand
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 04, 2023 | 3:24 PM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ ఓ ఇంటివారయ్యారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన రక్షితాతో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి వివాహం శనివారం రాత్రి జైపూర్ లోని లీలా ప్యాలెస్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలు, సన్నిహితులు, పలు సినీ ప్రముఖులు హజరయ్యి.. నూతన వధువరులను ఆశీర్వదించారు. సుమారు రెండు రోజులపాటు జరిగిన ఈ పెళ్లి వేడుకలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సిద్ధార్థ్, అదితి రావు హైదరీతాపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నూతన వధూవరులకు నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

శర్వానంద్ సతీమణి రక్షితా రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. హైదరాబాద్ కు చెందిన హైకోర్ట్ న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత. గతేడాది ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శర్వానంద్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ప్రస్తుతం డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఇంకా మొదలు కాలేదు. పెళ్లి పనుల నిమిత్తం శర్వా వర్క్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి
Sharwanand, Ram Charan

Sharwanand, Ram Charan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.