Samantha: ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా కొందరు మనతోనే ఉండిపోతారు’.. సమంత ఆసక్తికర పోస్ట్..

ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మొదటి సారి సామ్, విజయ్ జోడి కట్టడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి ఏర్పడింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం టర్కీలో షెడ్యూ్ల్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కాస్త బ్రేక్ దొరకడంతో విజయ్‏తోపాటు లంచ్‏కు వెళ్లారు సామ్. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ... విజయ్‏తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది సమంత.

Samantha: 'ఎలాంటి పరిస్థితుల్లోనైనా కొందరు మనతోనే ఉండిపోతారు'.. సమంత ఆసక్తికర పోస్ట్..
Samantha
Follow us

|

Updated on: Jun 02, 2023 | 2:30 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఖుషీ చిత్రంలో నటిస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మొదటి సారి సామ్, విజయ్ జోడి కట్టడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి ఏర్పడింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం టర్కీలో షెడ్యూ్ల్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కాస్త బ్రేక్ దొరకడంతో విజయ్‏తోపాటు లంచ్‏కు వెళ్లారు సామ్. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ… విజయ్‏తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది సమంత.

“నువ్వు చివర్లో ఉండడం చూశాను.. మొదట్లోకి రావడం చూశాను.. నీ ఉన్నతమైన స్థితిని చూశాను. జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ఎత్తు, పల్లాలను చూశాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కొంతమంది స్నేహితులు మనతోనే ఉండిపోతారు” అంటూ రాసుకొచ్చింది సామ్. అయితే ఆమె చేసిన పోస్ట్ పై విజయ్ స్పందిస్తూ.. సామ్ నా ఫేవరెట్ లేడీ అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరలవుతుండగా.. వీరిద్దరి ఫ్రెండ్ షిప్ చూడముచ్చటగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

కశ్మీర్ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథగా రూపొందుతోన్న ఖుషి మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 1న థియేటర్లలోకి రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.