AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ, బెంగాలీ సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది. అలాగే బిగ్ బాస్ తెలుగు తో పాటు పలు టీవీ షోల్లోనూ సందడి చేసింది. అయితే ఈ అందాల తార ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Swathi Deekshith
Basha Shek
|

Updated on: Dec 17, 2025 | 6:10 PM

Share

తిరుమల శ్రీవారిని బుధవారం (డిసెంబర్ 17) పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు దర్శించుకున్నారు. ఏడుకొండల స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ జాబితాలో ఒక టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా ఉంది. పై ఫొటో ఆమెదే. చాలా మంది ఆమెను గుర్తు పట్టలేకపోయారు. గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి తిరుమలలో ప్రత్యేక్షమైంది. అప్పట్లో స్లిమ్ గా నాజుకుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త బొద్దుగా మారిపోయింది. మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా? చాలా మంది హీరోయిన్లలానే ఈ బ్యూటీ కూడా ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా నటించింది. అయితే ఎక్కువగా గ్లామరస్ పాత్రలకే పరిమితమైంది. దీంతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోలేకపోయిందీ అందాల తార. ఈ బ్యూటీ చివరిగా 2021లో రామ్ గోపాల వర్మ తెరకెక్కించిన దెయ్యం సినిమాలో నటించింది. రాజశేఖర్ కూతురిగా కనిపించింది.

పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు ఆర్జీవీ తెరకెక్కించిన దెయ్యం సినిమా హీరోయిన్ స్వాతి దీక్షిత్. . 2010లో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది స్వాతి. ఇందులో హీరోయిన్ ప్రణీత స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత జంప్‌ జిలానీ, బ్రేకప్‌, చిత్రాంగద, దెయ్యం తదితర చిత్రాల్లో యాక్ట్‌ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

స్వాతి దీక్షిత్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

ఇక బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ (2020) లోనూ సందడి చేసింది స్వాతి దీక్షిత్. అయితే హౌస్ లో కేవలం మూడు వారాలు ఉండి ఎలిమినేట్ అయ్యింది. ఇక ఆర్జీవీ దెయ్యం తర్వాత మరే సినిమా, టీవీ షోలోనూ స్వాతి కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంటాయి.

గతంలో తిరుమల ఆలయం వద్ద నటి స్వాతి దీక్షిత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us