తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను నిర్వహించే ఓ స్వతంత్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటీష్ హయాంలో 1933లో టీటీడీ తొలి పాలకమండి ఏర్పాటయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి ఇదే కావడం విశేషం. 2024నాటికి టీటీడీ ఆస్తుల విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు టీటీడీ సొంతం. టీటీడీలో ప్రస్తుతం 16 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ 2019లో శ్రీవాణి ట్రస్టును నెలకొల్పింది. కొత్త ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ చేపట్టే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. దీని ద్వారా దేశ విదేశాల్లో పలు కొత్త ఆలయాలను నిర్మించారు

ఇంకా చదవండి

Tirumala Hotel Controversy: టెంపుల్ సిటీలో ముంతాజ్ హోటల్ మంటలు.. కొనసాగుతున్న సాధువుల ఆమరణ దీక్ష..

తిరుమలలో స్టార్‌ హోటల్‌ నిర్మాణం కొనసాగుతుండడంతో...ఏపీ సాధు పరిషత్ మరోసారి ఆందోళనకు దిగింది. ఇందులో భాగంగానే టీటీడీ పరిపాలనా భవనం ముందు ఆమరణ దీక్షకు దిగారు శ్రీనివాసానంద స్వామి. సనాతన ధర్మ పరిరక్షణ అంటే పవిత్రమైన స్థలంలో స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతించడమా... తిరుమల ప్రక్షాళన అంటే అపవిత్రం చేయడమా...అంటూ సాధువులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ గళమెత్తారు.

Pawan Kalyan: భక్తుల మనోభావాలు కాపాడాలన్నదే నా ఆవేదన.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ బుధవారం కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమం సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారని తెలిపారు.

Tirumala News: టీటీడీలో ఆ ఉద్యోగులపై చర్యలు.. 18 మందికి మెమోలు జారీ.. నెక్స్ట్ ఏంటంటే..

భక్తుల మనోభావాలే ముఖ్యం... తిరుమల పవిత్రతే లక్ష్యం అంటూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్న టీటీడీ... తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొండపై అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభించింది. 18మంది అన్యమత ఉద్యోగులను గుర్తించి వారికి మెమోలివ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి..!

టీటీడీ వైభవంగా రథసప్తమి ఉత్సవాలను నిర్వహిస్తోంది. రథసప్తమికి వచ్చే భక్తులను ఆకట్టుకునే విధంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మాఢ వీధులను ప్రత్యేకంగా అలంకరించింది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు ఫల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. 7 వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు మలయప్ప స్వామి.

Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రథసప్తమి వేళ ఆ దర్శనాలన్నీ రద్దు.. పూర్తి వివరాలివే..

తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ అధికారులు పకడ్బంధీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. రథసప్తమి వేడుకలకు తిరుమల మాడవీధులు ముస్తాబయ్యాయి. దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు హాజరుకానుండటంతో భద్రతా ఏర్పాట్లపై ఫోకస్ చేసింది టీటీడీ. ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ.. విచారణ కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక ఛాంబర్

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటనపై ఇవాళ్టి నుంచి జ్యుడీషియ‌ల్ ఎంక్వైరీ ప్రారంభం కానుంది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి నేతృత్వంలోని కమిషన్ తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌ర‌ప‌నుంది. ఆరునెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా

Tirumala: తిరుమలలో TTD చైర్మన్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు కీలక సూచనలు

Tirumala News: తిరుమలలోని బూందీపోటు, పరకామణి భవనంలో శనివారం టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరకామణి భవనంలో హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏవిధంగా తనిఖీ చేస్తారని ఆరా తీశారు. పరకామణి భవనంలో సిసి టివి నిఘా, భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Tirumala: కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ క్రేజీ హీరో.. ఫొటోలు చూశారా?

తమ సినిమా రిలీజ్‌లకు ముందు చాలామంది హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఓ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కాలినడకన తిరుమలకు వచ్చి ఏడుకొండలవాడిని దర్శించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Tirumala: వెంకన్న సన్నిధిలో రథసప్తమి వేడుకలు.. ఎన్ని లక్షల లడ్డూలు రెడీ చేస్తున్నారంటే..?

రథసప్తమి వస్తోంది...! భక్తుల తాకిడి గట్టిగానే ఉంటుంది...! మరేం చేద్దాం...? ఎలా ముందుకెళ్దాం...? ఇదే విషయమై సమావేశమైన టీటీడీ పాలక మండలి... కీలక నిర్ణయాలు తీసుకుంది. మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఛైర్మన్ పరిశీలించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం....

Tirumala: అబ్బ ఏం రాజసం.. తిరుమలలో చిరుత కలకలం.. శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీడియో చూశారా..

తిరుమలలో చిరుత కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం దగ్గర గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు.. టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. శిలాతోరణం దగ్గర ఉన్న కొండపై రాజసం ఒలకబోస్తూ కూర్చున్న చిరుత ఫోటో వైరల్‌గా మారింది. ఇక చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.