తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను నిర్వహించే ఓ స్వతంత్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటీష్ హయాంలో 1933లో టీటీడీ తొలి పాలకమండి ఏర్పాటయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి ఇదే కావడం విశేషం. 2024నాటికి టీటీడీ ఆస్తుల విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు టీటీడీ సొంతం. టీటీడీలో ప్రస్తుతం 16 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ 2019లో శ్రీవాణి ట్రస్టును నెలకొల్పింది. కొత్త ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ చేపట్టే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. దీని ద్వారా దేశ విదేశాల్లో పలు కొత్త ఆలయాలను నిర్మించారు
కలియుగ వైకుంఠంలో ఆకలి అనే పదానికి చోటు లేదు.. రోజూ ఎంత మందికి అన్నప్రసాదం అందిస్తారో తెలుసా..?
అది కలియుగ వైకుంఠం.. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం.. అన్నపూర్ణ నిలయంగా శ్రీవారి క్షేత్రం ఆకలికి చోటే లేని పవిత్ర స్థలంగా మారింది. రోజుకు 3 లక్షల మంది భక్తులకు టీటీడీ తృప్తికర భోజనం అందిస్తోంది. వేంకటాద్రి సమః స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి అన్న దైవ స్తోత్రానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.
- Raju M P R
- Updated on: Jan 12, 2026
- 3:00 pm
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ టికెట్ల జారీ రద్దు
శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. జనవరి 9 నుండి శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీ విధానంలో మార్పులు చేసింది. తిరుమలలో ఇప్పటివరకు ఆఫ్లైన్లో జారీ చేసిన 800 శ్రీవాణి టికెట్లను ఆన్లైన్ కరెంట్ బుకింగ్గా మార్చింది. భక్తుల సౌలభ్యం, క్యూలైన్లు తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త విధానం ప్రవేశపెట్టారు. ఆధార్ ధృవీకరణ తప్పనిసరి.
- Phani CH
- Updated on: Jan 10, 2026
- 4:15 pm
గురువారం అర్ధరాత్రి 12 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారం క్లోజ్
తిరుమల శ్రీవారి ఆలయంలో పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలు నేటి అర్ధరాత్రి ముగియనున్నాయి. డిసెంబరు 30న ప్రారంభమైన దర్శనాల్లో లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రద్దీకి తగ్గట్టు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. చివరి రోజుల్లోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకునే సువర్ణావకాశం ముగుస్తుంది.
- Phani CH
- Updated on: Jan 9, 2026
- 3:47 pm
Tirumala: తిరుమలకు ప్లాన్ చేస్తున్నారా ?? ఆ రోజు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక! మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా తిరుమల ఆలయం దాదాపు పదిన్నర గంటలపాటు మూసివేయబడుతుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 వరకు ఆలయం మూసి ఉంటుంది. ఈ సమయంలో అష్టదళపాద పద్మారాధన, కల్యాణోత్సవం వంటి ఆర్జిత సేవలు రద్దు. దర్శనం రాత్రి 8:30 నుండి పునఃప్రారంభమవుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.
- Phani CH
- Updated on: Jan 8, 2026
- 9:00 am
Tirumala: పది గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. ఈ సేవలన్నీ రద్దు!
గ్రహణ మాసానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆచారం. ఈ క్రమంలోనే మార్చి 03న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు తిరుమల ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. మార్చి 03న రాత్రి 8:30 గంటల తర్వాత శుద్ధి, ఇతర శుద్ధి కర్మల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Jan 4, 2026
- 3:41 pm
నో వెయిటింగ్.. నో పుషింగ్.. శ్రీవారి సన్నిధిలో కొత్త టెక్నాలజీ సూపర్ సక్సెస్
వైకుంఠ ఏకాదశి, జనవరి 1న తిరుమల భక్తులకు టీటీడీ ఆధునిక సాంకేతికత, AI, స్లాట్ విధానం ద్వారా సులభ దర్శనం కల్పించింది. రికార్డు స్థాయిలో భక్తులు వచ్చినా, గంటల నిరీక్షణ లేకుండా, తోపులాటలు లేకుండా దర్శన భాగ్యం కలిగింది. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ పర్యవేక్షణతో క్యూలైన్లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
- Phani CH
- Updated on: Jan 2, 2026
- 4:20 pm
Tirumala: టీటీడీ ఆల్ టైమ్ రికార్డ్.. గతేడాది ఎన్ని కోట్ల లడ్డూలు అమ్మిందో తెలిస్తే అవాక్కే..
2025 ఏడాదిలో టీటీడీ అన్నీ రికార్డులను బ్రేక్ చేసింది. శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయాలతో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించింది. మెరుగైన సేవలతో ఆల్ టైం రికార్డ్స్ను బ్రేక్ చేసింది. దీనికి సంబంధించి టీటీడీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
- Raju M P R
- Updated on: Jan 2, 2026
- 3:37 pm
శ్రీవారి భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు
టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే భక్తుల కోసం ఏడో మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ కేంద్రాన్ని ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. శ్రీవారి మెట్టు మార్గంలో ఇప్పటికే ఇలాంటి కేంద్రం ఉందని, భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఛైర్మన్ స్పష్టం చేశారు.
- Phani CH
- Updated on: Dec 31, 2025
- 8:31 pm
తిరుమలలో శ్రీవారి కంటే ముందు ఆ స్వామిని ఎందుకు దర్శించుకోవాలి.. అసలు రహస్యం ఏంటంటే..?
తిరుమల వెళ్తున్నారా.. మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.. తిరుమల యాత్రలో శ్రీ భూవరాహ స్వామి దర్శనం అత్యంత కీలకం. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహ స్వామిని పూజించడం ప్రాచీన సంప్రదాయం. అసలు వరాహ స్వామిని ఎందుకు ముందు దర్శించుకోవాలి.. దీన్ని వెనక ఉన్న రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Dec 30, 2025
- 6:09 pm
Tirumala: శుభగడియలు వచ్చేశాయ్.. వైకుంఠ ద్వార దర్శనాలకు సర్వం సిద్ధం.. పూర్తి సమాచారం ఇదిగో..
జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికులకు లోకల్ కోటా కింద స్వామివారి దర్శనం కల్పిస్తారు. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా రోజుకు 5వేల దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 29, 2025
- 5:47 pm
TTD: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. 3 రోజుల పాటు దర్శన టికెట్ల జారీ రద్దు!
TTD Stopped Srivani Darshan Tickets For 3 Days: శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లే భక్తులు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి, క్రిస్మస్ వరుస సెలవుల నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని భక్తులు శ్రీవారి దర్శననానికి క్యూకట్టారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటలు పడుతుంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
- Anand T
- Updated on: Dec 26, 2025
- 6:58 am
ఇక.. విదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు.. గ్లోబల్ గుర్తింపు దిశగా టీటీడీ అడుగులు
టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు బృహత్తర ప్రణాళికను రూపొందించింది. సీఎం చంద్రబాబు సూచనలతో, శ్రీవారి ఆలయాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పాలకమండలి కసరత్తు చేస్తోంది. నిపుణుల కమిటీ చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసింది. త్వరలోనే వివిధ దేశాల్లో శ్రీనివాసుడి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. విదేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు అనుగుణంగా, తిరుమల తరహాలో ఆగమశాస్త్ర పూజలతో ఆలయాలను నిర్మిస్తారు.
- Phani CH
- Updated on: Dec 24, 2025
- 1:51 pm