తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను నిర్వహించే ఓ స్వతంత్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటీష్ హయాంలో 1933లో టీటీడీ తొలి పాలకమండి ఏర్పాటయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి ఇదే కావడం విశేషం. 2024నాటికి టీటీడీ ఆస్తుల విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు టీటీడీ సొంతం. టీటీడీలో ప్రస్తుతం 16 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ 2019లో శ్రీవాణి ట్రస్టును నెలకొల్పింది. కొత్త ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ చేపట్టే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. దీని ద్వారా దేశ విదేశాల్లో పలు కొత్త ఆలయాలను నిర్మించారు
Mukesh Ambani: తిరుమల వెంకన్న సన్నిధి లో అంబానీ కుటుంబం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కలిసి అభిషేక సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
- Raju M P R
- Updated on: Jun 12, 2026
- 7:01 pm
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం మెనూలోకి రానున్న పప్పు
తిరుమలలో భక్తులకు అందించే అన్నప్రసాదంలో త్వరలోనే పప్పును చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భక్తుల విజ్ఞప్తుల మేరకు టీటీడీ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం అందిస్తున్న ఏడు రకాల వంటకాలతో పాటు పప్పు కూడా అందించేందుకు చర్యలు చేపడుతోంది. దీనిపై రాబోయే టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
- Phani CH
- Updated on: Jun 12, 2026
- 6:27 pm
ఏమాత్రం తగ్గని తిరుమల లడ్డు ప్రసాద మాధుర్యం.. శ్రీవారి లడ్డూ విక్రయాల్లో ఆల్టైమ్ రికార్డ్!
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలలో అత్యంత విశిష్టమైన 'తిరుపతి లడ్డూ' సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు, ఈ ఏడాది మే నెలలో మునుపెన్నడూ లేని విధంగా సర్వకాల గరిష్ట స్థాయికి చేరాయి.
- Raju M P R
- Updated on: Jun 3, 2026
- 5:44 pm
TTD: శ్రీవారి భక్తులకు భారీ ఊరట ఇక.. క్యూలైన్లో ఉండే పని లేదు
తిరుమలలో సర్వదర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండే భక్తులకు టీటీడీ కొత్త రీ-ఎంట్రీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా భక్తులు క్యూలైన్ నుంచి తాత్కాలికంగా బయటకు వెళ్లి విశ్రాంతి తీసుకుని, నిర్ణీత సమయంలో తిరిగి దర్శనానికి హాజరుకావచ్చు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు ఇది ఎంతో ఉపశమనం కలిగించనుంది.
- Phani CH
- Updated on: May 29, 2026
- 4:44 pm
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా దర్శనం టికెట్ల జారీ..
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు వేలాదిమంది భక్తులు కొండపైకి చేరుకుంటారు. వివిధ దర్శనాలతో స్వామివారిని దర్శించుకుంటారు. టీటీడీ ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ టికెట్లను విడుదల చేస్తోంది. తాజాగా దేశ, విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారికి ఎయిర్పోర్టుల్లోనే టికెట్లను విడుదల చేయనుంది.
- Venkatrao Lella
- Updated on: May 25, 2026
- 3:11 pm
తిరుమలలో నో ఎంట్రీ! నిండిపోయిన క్యూలైన్లు.. కొండంత రద్దీ.. కొండల రాయుడి రికార్డ్..!
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అసాధారణ స్థాయిలో కొనసాగుతోంది. వేసవి సెలవులు, వీకెండ్ తోడుకావడంతో దేశం నలుమూలల నుండి భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో కొండపై ఎటు చూసినా భక్తుల జనసందోహమే కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.
- Balaraju Goud
- Updated on: May 24, 2026
- 10:47 am
Tirumala: మరింత వేగంగా శ్రీవారి దర్శనం.. సామాన్య భక్తులకు టీటీడీ అదిరిపోయే ఛాన్స్..
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ భారీ గుడ్ న్యూస్ అందించింది. సామాన్య భక్తులకు మరింత వేగంగా దర్శన అవకాశం కల్పించనుంది. ఈ మేరకు టీటీడీ మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. శ్రీవారి అభిషేక సేవ సమయంలో కూడా 5 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు సిద్దమైంది.
- Venkatrao Lella
- Updated on: May 22, 2026
- 12:19 pm
కొండంత జనం.. 30 గంటల దర్శనం! తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ
కలియుగ వైకుంఠం తిరుమల కొండపై వేసవి తాకిడికి తోడు భక్తజన సందోహం పోటెత్తింది. గత వారం రోజులుగా పెరిగిన భక్తుల రద్దీతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. "గోవిందా.. గోవిందా.." స్మరణలతో తిరుగిరులు మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 30 గంటలకు పైగా సమయం పడుతోంది.
- Raju M P R
- Updated on: May 22, 2026
- 8:07 am
Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు ప్రత్యేక రైళ్లు.. రైల్వేశాఖ నుంచి మరో అప్డేట్..
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళుతున్నారా..? రైళ్లల్లో సీట్లు దొరకడం లేదా..? అయితే మీకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను పొడిగించింది. వన్ వే రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుపతి వైపు వెళ్లేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
- Venkatrao Lella
- Updated on: May 21, 2026
- 3:35 pm
Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. శ్రీవాణి దర్శన టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన..
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్పై వస్తున్న వార్తల నేపథ్యంలో భక్తులు అపోహలకు గురికావద్దని స్పష్టం చేసింది. కొందరు దళారులు ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతులతో టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అధికారిక వ్యవస్థను హ్యాక్ చేయడం అసాధ్యమని టీటీడీ తెలిపింది. అనుమానాస్పద బుకింగ్లను గుర్తించి వెంటనే బ్లాక్ చేస్తున్నామని వెల్లడించింది. భక్తులు కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించింది.
- Shaik Madar Saheb
- Updated on: May 13, 2026
- 6:47 pm
శ్రీవారి దర్శనంలో పెద్ద మార్పు.. సిఫారసు లేఖలకు గుడ్బై! టీటీడీ కీలక నిర్ణయాలు
Tirumala Tirupati Devasthanam: తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో 82 అంశాలపై చర్చించి, వేసవిలో భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
- Raju M P R
- Updated on: May 6, 2026
- 2:41 pm
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్.. కొండపై బిగ్ క్యాంటీన్లు..
సమ్మర్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. గతంలో కంటే రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో టీటీడీ భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో బిగ్ క్యాంటీన్లను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురాావాలని భావిస్తోంది. ఈ మేరకు టీటీడీ ఆదేశించింది.
- Venkatrao Lella
- Updated on: Apr 28, 2026
- 8:40 pm