AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను నిర్వహించే ఓ స్వతంత్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటీష్ హయాంలో 1933లో టీటీడీ తొలి పాలకమండి ఏర్పాటయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి ఇదే కావడం విశేషం. 2024నాటికి టీటీడీ ఆస్తుల విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు టీటీడీ సొంతం. టీటీడీలో ప్రస్తుతం 16 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ 2019లో శ్రీవాణి ట్రస్టును నెలకొల్పింది. కొత్త ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ చేపట్టే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. దీని ద్వారా దేశ విదేశాల్లో పలు కొత్త ఆలయాలను నిర్మించారు

ఇంకా చదవండి

ఒక్క జూన్‌లో వెంకన్నకు ఎన్ని కోట్ల ఆదాయమొచ్చిందో తెలుసా? నోరెళ్లబెట్టే లెక్కలు

ఆపద మొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది వేసవిలో తిరుమల కొండ కిటికిటలాడింది. భక్తులతోపాటు హుండీ కానుకలు కూడా అంతకంతకు పెరుగుతున్నట్లు టిటిడి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ నెలలో రోజుకు సగటున 80 వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది.

Tirumala: తిరుమల వెళుతున్నారా..? టీటీడీ మరో కొత్త రూల్.. కొండపై ఆ పని చేస్తే..

తిరుమల శ్రీవారి భక్తులకు ప్రశాంతవంతమైన, శబ్ద కాలుష్యం లేని వాతావరణం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండ, రహదారుల్లో హారన్లు ఉపయోగించడంపై నిషేధం విధించింది. హారన్లు, సైరన్లు ఉపయోగించవద్దని సూచించింది. ఈ మేరకు తిరుమలలో బోర్డులు ఏర్పాటు చేసింది.

Tirumala: ప్రతీ రోజూ వెయ్యి మందికి తిరుమల శ్రీవారి దర్శనం ఫ్రీ.. ఉచితంగా రూ.50 లడ్డూ కూడా..

తిరుమల శ్రీవారి దర్శనాలపై టీటీడీ మరో ప్రకటన చేసింది. దివ్యాంగులు, వయోవృద్దులకు ఉచిత దర్శనాలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతీ రోజు వెయ్యి మందికి ఈ ప్రత్యేక దర్శనం ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా వీరికి ఉచితంగా ఒక లడ్డూ కూడా అందిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Tirumala: తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో స్పెషల్ ట్రైన్.. టైమింగ్స్ ఇవే..

తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్. మరో ప్రత్యేక రైలును ప్రకటించింది. చర్లపల్లి-తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్ ప్రవేశపెట్టింది. తిరుమల శ్రీవారి భక్తులకు ఈ ట్రైన్ ఎంతగానో ఉపయోగపడనుంది. ట్రైన్ టైమింగ్స్, హాల్ట్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వాటి వివరాలు చూద్దాం.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ అలర్ట్.. ఉచిత దర్శనం టోకెన్ల జారీ సమయాల్లో మార్పులు.. ఇక నుంచి..

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఎస్‌డీ ఉచిత దర్శన టోకెన్ల జారీ సమయాలను మార్చింది. మొన్నటివరకు వేసవి రద్దీ కారణంగా ఉదయం 4 లేదా 5 గంటల సమయంలో టికెట్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు రద్దీ తగ్గడంతో సమయంలో మార్పులు చేశారు.

Tirumala: కేవలం రూ.120 చెల్లిస్తే చాలు.. మొదటి గడప నుంచే శ్రీవారిని దర్శించుకోవచ్చు.. ఎలానో చూడండి..

తిరుమల శ్రీవారిని అతి దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలనే కోరిక మీకు ఉందా.. అయితే టీటీడీ అద్బుత అవకాశం కల్పిస్తోంది. కేవలం రూ.120 చెల్లించడం ద్వారా మొదటి గడప నుంచే దర్శించుకోవచ్చు. అసలు ఈ విధానంలో దర్శనం ఎలా చేసుకోవాలనేది చూద్దాం.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..! సెప్టెంబర్ దర్శన కోటా విడుదల.. షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ

తిరుమల, జూన్ 13: సెప్టెంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాల విడుదల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. శ్రీవారి దర్శనం కోసం ముందస్తుగా ప్రణాళికలు వేసుకునే భక్తులు నిర్ణీత తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Mukesh Ambani: తిరుమల వెంకన్న సన్నిధి లో అంబానీ కుటుంబం

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కలిసి అభిషేక సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం మెనూలోకి రానున్న పప్పు

తిరుమలలో భక్తులకు అందించే అన్నప్రసాదంలో త్వరలోనే పప్పును చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భక్తుల విజ్ఞప్తుల మేరకు టీటీడీ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం అందిస్తున్న ఏడు రకాల వంటకాలతో పాటు పప్పు కూడా అందించేందుకు చర్యలు చేపడుతోంది. దీనిపై రాబోయే టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

  • Phani CH
  • Updated on: Jun 12, 2026
  • 6:27 pm

ఏమాత్రం తగ్గని తిరుమల లడ్డు ప్రసాద మాధుర్యం.. శ్రీవారి లడ్డూ విక్రయాల్లో ఆల్‌టైమ్ రికార్డ్!

కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలలో అత్యంత విశిష్టమైన 'తిరుపతి లడ్డూ' సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు, ఈ ఏడాది మే నెలలో మునుపెన్నడూ లేని విధంగా సర్వకాల గరిష్ట స్థాయికి చేరాయి.

TTD: శ్రీవారి భక్తులకు భారీ ఊరట ఇక.. క్యూలైన్‌లో ఉండే పని లేదు

తిరుమలలో సర్వదర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండే భక్తులకు టీటీడీ కొత్త రీ-ఎంట్రీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా భక్తులు క్యూలైన్ నుంచి తాత్కాలికంగా బయటకు వెళ్లి విశ్రాంతి తీసుకుని, నిర్ణీత సమయంలో తిరిగి దర్శనానికి హాజరుకావచ్చు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు ఇది ఎంతో ఉపశమనం కలిగించనుంది.

  • Phani CH
  • Updated on: May 29, 2026
  • 4:44 pm

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా దర్శనం టికెట్ల జారీ..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు వేలాదిమంది భక్తులు కొండపైకి చేరుకుంటారు. వివిధ దర్శనాలతో స్వామివారిని దర్శించుకుంటారు. టీటీడీ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లను విడుదల చేస్తోంది. తాజాగా దేశ, విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారికి ఎయిర్‌పోర్టుల్లోనే టికెట్లను విడుదల చేయనుంది.