తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను నిర్వహించే ఓ స్వతంత్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటీష్ హయాంలో 1933లో టీటీడీ తొలి పాలకమండి ఏర్పాటయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి ఇదే కావడం విశేషం. 2024నాటికి టీటీడీ ఆస్తుల విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు టీటీడీ సొంతం. టీటీడీలో ప్రస్తుతం 16 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ 2019లో శ్రీవాణి ట్రస్టును నెలకొల్పింది. కొత్త ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ చేపట్టే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. దీని ద్వారా దేశ విదేశాల్లో పలు కొత్త ఆలయాలను నిర్మించారు
ఇంకా చదవండివెంకన్న హుండీ బంగారంపై టీటీడీ సంచలన నిర్ణయం.. బంగారం సరే.. మరి రత్నాల సంగతేంటి?
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించే హుండీ కానుకల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక మార్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముఖ్యంగా హుండీలో లభించే బంగారు కానుకలను నేరుగా విక్రయించకూడదని నిర్ణయించింది. వాటిని బంగారు బిస్కెట్లుగా మార్చి బ్యాంకుల్లో గోల్డ్ డిపాజిట్గా ఉంచే విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది. మరోవైపు బంగారు ఆభరణాల్లో ఉన్న రత్నాలు, విలువైన రాళ్లను మాత్రం వేరు చేసి వేలం వేయాలని ప్రతిపాదించింది.
- Raju M P R
- Updated on: Aug 13, 2026
- 5:30 pm
Tirumala: తిరుమలకు వెళ్లేవారికి రైల్వేశాఖ భారీ శుభవార్త.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు వచ్చేశాయి.. టైమింగ్స్ ఇవే..
తిరుమల వెళ్లే భక్తులకు సూపర్ న్యూస్. రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. మరో ప్రత్యేక వీక్లీ రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైలు షెడ్యూల్ వివరాలను కూడా ప్రకటించింది. ఈ ట్రైన్ టైమింగ్స్ ఏంటి.. ఏయే రోజుల్లో సర్వీసులు అందించనుందనే వివరాలు ఇలా..
- Venkatrao Lella
- Updated on: Aug 13, 2026
- 10:06 am
TTD Hundi Collection: శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం జూలై నెలలో చరిత్రలోనే అత్యధికంగా నమోదైంది. 24.52 లక్షల మంది భక్తులు దర్శించుకోగా రూ.140.28 కోట్ల కానుకలు హుండీ ద్వారా వచ్చాయి. లడ్డూ విక్రయాలు కూడా కొత్త రికార్డు సృష్టించాయి. ఒకే నెలలో 1.30 కోట్లకు పైగా లడ్డూలు విక్రయించి, భక్తులకు ఎలాంటి కొరత లేకుండా టీటీడీ సమర్థంగా పంపిణీ చేసింది.
- Phani CH
- Updated on: Aug 7, 2026
- 5:40 pm
TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? బీ అలర్ట్!
తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్లు, వీఐపీ దర్శనాల మోసాలు, నకిలీ ఉద్యోగుల వలలు, రియల్ ఎస్టేట్ ఆఫర్లు, విగ్రహాల చోరీల వరకు వరుస ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. టీటీడీ పేరును అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటుండటంతో భక్తులు అధికారిక మార్గాల ద్వారానే సేవలు పొందాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
- Phani CH
- Updated on: Jul 31, 2026
- 4:17 pm
తిరుమలలో వింత.. నీళ్ల కోసం కుళాయి తెరిస్తే పాలు వస్తున్నాయి! టెస్ట్ చేయించి నిజం తేల్చిన టీటీడీ
తిరుమల జపాలి తీర్థంలో కుళాయిల నుంచి పాలలా తెల్లగా వస్తున్న నీటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై టీటీడీ స్పందించి అసలు కారణాన్ని వెల్లడించింది. వాటర్ ప్రెజర్ వల్ల ఏర్పడే సూక్ష్మ గాలి బుడగల కారణంగానే నీరు తాత్కాలికంగా తెల్లగా కనిపిస్తోందని, పరీక్షల్లో నీరు పూర్తిగా స్వచ్ఛమైనదేనని స్పష్టం చేసింది.
- Raju M P R
- Updated on: Jul 26, 2026
- 10:26 am
Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శనం టికెట్ల జారీ బంద్.. మళ్లీ ఎప్పటినుంచంటే..?
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఎస్ఎస్డీ టికెట్ల జారీని నిలిపివేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి ఎప్పటిలాగే టికెట్లను పంపిణీ చేయనుంది. భక్తులు దీనిని గమనించాలి.
- Venkatrao Lella
- Updated on: Jul 22, 2026
- 8:07 am
టీటీడీ గోశాలలో కలకలం.. శ్రీవారి సేవ చేయక ముందే గుర్రం మృతి.. విరాళం ఇచ్చిన వారానికే..
టీటీడీ ఎస్వీ గోశాలకు ఇటీవల విరాళంగా వచ్చిన మార్వాడి జాతికి చెందిన తొమ్మిదేళ్ల మగ గుర్రం, శ్రీవారి సేవలో పాల్గొనకముందే మృతి చెందింది. మధురైకు చెందిన భక్తుడు వడివేలు ముగంధన్ జూలై 13న ఈ గుర్రాన్ని విరాళంగా అందజేశారు. గోశాలకు చేరిన వెంటనే క్వారంటైన్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించగా, దీర్ఘకాలిక కాలేయం, మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
- Raju M P R
- Updated on: Jul 19, 2026
- 8:58 am
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగే పర్వదినాలు, వార్షిక ఉత్సవాల సందర్భంగా పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో పూర్తిగా బ్రేక్ దర్శనాలు ఉండవని తెలిపింది. భక్తులు ముందుగానే తేదీలను పరిశీలించి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
- Phani CH
- Updated on: Jul 12, 2026
- 7:14 pm
116 ఏళ్ల నవనీతమ్మ సంకల్పం.. వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వయసులో అలిపిరి మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్న నవనీతమ్మ భక్తి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు గుర్తించి కుటుంబంతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి ఆమె సంకల్పాన్ని కొనియాడారు. భక్తికి వయసు అడ్డుకాదని నిరూపించిన ఈ ఘటన ఇప్పుడు లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచింది.
- Phani CH
- Updated on: Jul 7, 2026
- 1:10 pm
శ్రీవారి వైభోగం..! జూన్లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో ఆల్టైమ్ రికార్డ్!
తిరుమలలో 2026 జూన్ నెలలో భక్తుల రద్దీతో హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు కొత్త రికార్డులు సృష్టించాయి. హుండీ ద్వారా రూ.128.29 కోట్ల ఆదాయం లభించగా, 1.26 కోట్లకు పైగా శ్రీవారి లడ్డూలు విక్రయమయ్యాయి. ఏఐ ఆధారిత భక్తుల నిర్వహణ వ్యవస్థతో టీటీడీ దర్శనాలను సమర్థవంతంగా నిర్వహించి మరో మైలురాయిని నెలకొల్పింది.
- Phani CH
- Updated on: Jul 6, 2026
- 4:55 pm
ఒక్క జూన్లో వెంకన్నకు ఎన్ని కోట్ల ఆదాయమొచ్చిందో తెలుసా? నోరెళ్లబెట్టే లెక్కలు
ఆపద మొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది వేసవిలో తిరుమల కొండ కిటికిటలాడింది. భక్తులతోపాటు హుండీ కానుకలు కూడా అంతకంతకు పెరుగుతున్నట్లు టిటిడి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ నెలలో రోజుకు సగటున 80 వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది.
- Raju M P R
- Updated on: Jul 3, 2026
- 8:41 pm
Tirumala: తిరుమల వెళుతున్నారా..? టీటీడీ మరో కొత్త రూల్.. కొండపై ఆ పని చేస్తే..
తిరుమల శ్రీవారి భక్తులకు ప్రశాంతవంతమైన, శబ్ద కాలుష్యం లేని వాతావరణం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండ, రహదారుల్లో హారన్లు ఉపయోగించడంపై నిషేధం విధించింది. హారన్లు, సైరన్లు ఉపయోగించవద్దని సూచించింది. ఈ మేరకు తిరుమలలో బోర్డులు ఏర్పాటు చేసింది.
- Venkatrao Lella
- Updated on: Jul 1, 2026
- 6:59 pm