AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను నిర్వహించే ఓ స్వతంత్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటీష్ హయాంలో 1933లో టీటీడీ తొలి పాలకమండి ఏర్పాటయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి ఇదే కావడం విశేషం. 2024నాటికి టీటీడీ ఆస్తుల విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు టీటీడీ సొంతం. టీటీడీలో ప్రస్తుతం 16 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ 2019లో శ్రీవాణి ట్రస్టును నెలకొల్పింది. కొత్త ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ చేపట్టే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. దీని ద్వారా దేశ విదేశాల్లో పలు కొత్త ఆలయాలను నిర్మించారు

ఇంకా చదవండి

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగే పర్వదినాలు, వార్షిక ఉత్సవాల సందర్భంగా పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో పూర్తిగా బ్రేక్ దర్శనాలు ఉండవని తెలిపింది. భక్తులు ముందుగానే తేదీలను పరిశీలించి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

  • Phani CH
  • Updated on: Jul 12, 2026
  • 7:14 pm

116 ఏళ్ల నవనీతమ్మ సంకల్పం.. వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ

116 ఏళ్ల వయసులో అలిపిరి మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్న నవనీతమ్మ భక్తి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు గుర్తించి కుటుంబంతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి ఆమె సంకల్పాన్ని కొనియాడారు. భక్తికి వయసు అడ్డుకాదని నిరూపించిన ఈ ఘటన ఇప్పుడు లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచింది.

  • Phani CH
  • Updated on: Jul 7, 2026
  • 1:10 pm

శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో ఆల్‌టైమ్ రికార్డ్!

తిరుమలలో 2026 జూన్ నెలలో భక్తుల రద్దీతో హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు కొత్త రికార్డులు సృష్టించాయి. హుండీ ద్వారా రూ.128.29 కోట్ల ఆదాయం లభించగా, 1.26 కోట్లకు పైగా శ్రీవారి లడ్డూలు విక్రయమయ్యాయి. ఏఐ ఆధారిత భక్తుల నిర్వహణ వ్యవస్థతో టీటీడీ దర్శనాలను సమర్థవంతంగా నిర్వహించి మరో మైలురాయిని నెలకొల్పింది.

  • Phani CH
  • Updated on: Jul 6, 2026
  • 4:55 pm

ఒక్క జూన్‌లో వెంకన్నకు ఎన్ని కోట్ల ఆదాయమొచ్చిందో తెలుసా? నోరెళ్లబెట్టే లెక్కలు

ఆపద మొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది వేసవిలో తిరుమల కొండ కిటికిటలాడింది. భక్తులతోపాటు హుండీ కానుకలు కూడా అంతకంతకు పెరుగుతున్నట్లు టిటిడి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ నెలలో రోజుకు సగటున 80 వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది.

Tirumala: తిరుమల వెళుతున్నారా..? టీటీడీ మరో కొత్త రూల్.. కొండపై ఆ పని చేస్తే..

తిరుమల శ్రీవారి భక్తులకు ప్రశాంతవంతమైన, శబ్ద కాలుష్యం లేని వాతావరణం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండ, రహదారుల్లో హారన్లు ఉపయోగించడంపై నిషేధం విధించింది. హారన్లు, సైరన్లు ఉపయోగించవద్దని సూచించింది. ఈ మేరకు తిరుమలలో బోర్డులు ఏర్పాటు చేసింది.

Tirumala: ప్రతీ రోజూ వెయ్యి మందికి తిరుమల శ్రీవారి దర్శనం ఫ్రీ.. ఉచితంగా రూ.50 లడ్డూ కూడా..

తిరుమల శ్రీవారి దర్శనాలపై టీటీడీ మరో ప్రకటన చేసింది. దివ్యాంగులు, వయోవృద్దులకు ఉచిత దర్శనాలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతీ రోజు వెయ్యి మందికి ఈ ప్రత్యేక దర్శనం ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా వీరికి ఉచితంగా ఒక లడ్డూ కూడా అందిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Tirumala: తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో స్పెషల్ ట్రైన్.. టైమింగ్స్ ఇవే..

తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్. మరో ప్రత్యేక రైలును ప్రకటించింది. చర్లపల్లి-తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్ ప్రవేశపెట్టింది. తిరుమల శ్రీవారి భక్తులకు ఈ ట్రైన్ ఎంతగానో ఉపయోగపడనుంది. ట్రైన్ టైమింగ్స్, హాల్ట్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వాటి వివరాలు చూద్దాం.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ అలర్ట్.. ఉచిత దర్శనం టోకెన్ల జారీ సమయాల్లో మార్పులు.. ఇక నుంచి..

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఎస్‌డీ ఉచిత దర్శన టోకెన్ల జారీ సమయాలను మార్చింది. మొన్నటివరకు వేసవి రద్దీ కారణంగా ఉదయం 4 లేదా 5 గంటల సమయంలో టికెట్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు రద్దీ తగ్గడంతో సమయంలో మార్పులు చేశారు.

Tirumala: కేవలం రూ.120 చెల్లిస్తే చాలు.. మొదటి గడప నుంచే శ్రీవారిని దర్శించుకోవచ్చు.. ఎలానో చూడండి..

తిరుమల శ్రీవారిని అతి దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలనే కోరిక మీకు ఉందా.. అయితే టీటీడీ అద్బుత అవకాశం కల్పిస్తోంది. కేవలం రూ.120 చెల్లించడం ద్వారా మొదటి గడప నుంచే దర్శించుకోవచ్చు. అసలు ఈ విధానంలో దర్శనం ఎలా చేసుకోవాలనేది చూద్దాం.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..! సెప్టెంబర్ దర్శన కోటా విడుదల.. షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ

తిరుమల, జూన్ 13: సెప్టెంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాల విడుదల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. శ్రీవారి దర్శనం కోసం ముందస్తుగా ప్రణాళికలు వేసుకునే భక్తులు నిర్ణీత తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Mukesh Ambani: తిరుమల వెంకన్న సన్నిధి లో అంబానీ కుటుంబం

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కలిసి అభిషేక సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం మెనూలోకి రానున్న పప్పు

తిరుమలలో భక్తులకు అందించే అన్నప్రసాదంలో త్వరలోనే పప్పును చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భక్తుల విజ్ఞప్తుల మేరకు టీటీడీ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం అందిస్తున్న ఏడు రకాల వంటకాలతో పాటు పప్పు కూడా అందించేందుకు చర్యలు చేపడుతోంది. దీనిపై రాబోయే టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

  • Phani CH
  • Updated on: Jun 12, 2026
  • 6:27 pm
కొంప ముంచిన మేనకోడలి ప్రేమ వ్యవహారం.. మేనమామ దారుణ హత్య
కొంప ముంచిన మేనకోడలి ప్రేమ వ్యవహారం.. మేనమామ దారుణ హత్య
భారత్‌ను భయపెడుతున్న ఎల్ నినో.. రాబోయే రోజుల్లో కరువు తప్పదా?
భారత్‌ను భయపెడుతున్న ఎల్ నినో.. రాబోయే రోజుల్లో కరువు తప్పదా?
OTTలోకి వచ్చేసిన సాయి పల్లవి తొలి హిందీ సినిమా.. తెలుగులోనూ ఉంది
OTTలోకి వచ్చేసిన సాయి పల్లవి తొలి హిందీ సినిమా.. తెలుగులోనూ ఉంది
వారం రోజులు వర్షాలు లేనట్లే.. వాతావరణశాఖ అప్డేట్ ఇదిగో..
వారం రోజులు వర్షాలు లేనట్లే.. వాతావరణశాఖ అప్డేట్ ఇదిగో..
వారంలోనే మిలియన్ వ్యూస్‏తో టాప్ ట్రెండింగ్..
వారంలోనే మిలియన్ వ్యూస్‏తో టాప్ ట్రెండింగ్..
రెండో వన్డేకు ముందే టీమిండియాకు షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్?
రెండో వన్డేకు ముందే టీమిండియాకు షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్?
PhD చేసిన ప్రొఫెసర్‌కు ఇదేం పరిస్థితి? సోషల్ మీడియాలో రచ్చ రంబోలా
PhD చేసిన ప్రొఫెసర్‌కు ఇదేం పరిస్థితి? సోషల్ మీడియాలో రచ్చ రంబోలా
చనిపోయే సమయంలో కొందరి ముఖం వంకరగా ఎందుకు మారుతుంది? గరుడ పురాణం..
చనిపోయే సమయంలో కొందరి ముఖం వంకరగా ఎందుకు మారుతుంది? గరుడ పురాణం..
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ