తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను నిర్వహించే ఓ స్వతంత్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటీష్ హయాంలో 1933లో టీటీడీ తొలి పాలకమండి ఏర్పాటయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి ఇదే కావడం విశేషం. 2024నాటికి టీటీడీ ఆస్తుల విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు టీటీడీ సొంతం. టీటీడీలో ప్రస్తుతం 16 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ 2019లో శ్రీవాణి ట్రస్టును నెలకొల్పింది. కొత్త ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ చేపట్టే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. దీని ద్వారా దేశ విదేశాల్లో పలు కొత్త ఆలయాలను నిర్మించారు
Tirumala: మరింత వేగంగా శ్రీవారి దర్శనం.. సామాన్య భక్తులకు టీటీడీ అదిరిపోయే ఛాన్స్..
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ భారీ గుడ్ న్యూస్ అందించింది. సామాన్య భక్తులకు మరింత వేగంగా దర్శన అవకాశం కల్పించనుంది. ఈ మేరకు టీటీడీ మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. శ్రీవారి అభిషేక సేవ సమయంలో కూడా 5 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు సిద్దమైంది.
- Venkatrao Lella
- Updated on: May 22, 2026
- 12:19 pm
కొండంత జనం.. 30 గంటల దర్శనం! తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ
కలియుగ వైకుంఠం తిరుమల కొండపై వేసవి తాకిడికి తోడు భక్తజన సందోహం పోటెత్తింది. గత వారం రోజులుగా పెరిగిన భక్తుల రద్దీతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. "గోవిందా.. గోవిందా.." స్మరణలతో తిరుగిరులు మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 30 గంటలకు పైగా సమయం పడుతోంది.
- Raju M P R
- Updated on: May 22, 2026
- 8:07 am
Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు ప్రత్యేక రైళ్లు.. రైల్వేశాఖ నుంచి మరో అప్డేట్..
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళుతున్నారా..? రైళ్లల్లో సీట్లు దొరకడం లేదా..? అయితే మీకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను పొడిగించింది. వన్ వే రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుపతి వైపు వెళ్లేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
- Venkatrao Lella
- Updated on: May 21, 2026
- 3:35 pm
Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. శ్రీవాణి దర్శన టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన..
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్పై వస్తున్న వార్తల నేపథ్యంలో భక్తులు అపోహలకు గురికావద్దని స్పష్టం చేసింది. కొందరు దళారులు ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతులతో టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అధికారిక వ్యవస్థను హ్యాక్ చేయడం అసాధ్యమని టీటీడీ తెలిపింది. అనుమానాస్పద బుకింగ్లను గుర్తించి వెంటనే బ్లాక్ చేస్తున్నామని వెల్లడించింది. భక్తులు కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించింది.
- Shaik Madar Saheb
- Updated on: May 13, 2026
- 6:47 pm
శ్రీవారి దర్శనంలో పెద్ద మార్పు.. సిఫారసు లేఖలకు గుడ్బై! టీటీడీ కీలక నిర్ణయాలు
Tirumala Tirupati Devasthanam: తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో 82 అంశాలపై చర్చించి, వేసవిలో భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
- Raju M P R
- Updated on: May 6, 2026
- 2:41 pm
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్.. కొండపై బిగ్ క్యాంటీన్లు..
సమ్మర్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. గతంలో కంటే రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో టీటీడీ భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో బిగ్ క్యాంటీన్లను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురాావాలని భావిస్తోంది. ఈ మేరకు టీటీడీ ఆదేశించింది.
- Venkatrao Lella
- Updated on: Apr 28, 2026
- 8:40 pm
వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఎండల నుంచి రిలీఫ్.. టీటీడీ భలే ప్లాన్..!
రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పుల కొలిమిలా మారుతున్న వాతావరణం సామాన్యులను వణికిస్తోంది. ఈ వేడి సెగలు ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై పడకుండా ఉండేందుకు టీటీడీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది. భక్తులకు కొండంత అండగా నిలుస్తూ దాదాపు రూ. 3.21 కోట్లతో వేసవి తాపాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
- Raju M P R
- Updated on: Apr 21, 2026
- 9:10 am
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల జారీలో మార్పులు
తిరుమల దర్శనం కోసం వేసవిలో పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ కీలక మార్పులు చేసింది. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల సమయాలు మారాయి. ఇకపై ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచే శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్లు పొందవచ్చు. ఎండల నుండి భక్తులకు ఉపశమనం, మెరుగైన దర్శన అనుభవం కోసం ఈ నిర్ణయం. ఆధార్ తప్పనిసరి.
- Phani CH
- Updated on: Apr 16, 2026
- 5:55 pm
వామ్మో.. పే..ద్ద పాము.. నడక మార్గంలో నాగరాజు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. అంతటా ఉక్కపోత.. వడగాల్పులతో జనం విలవిల్లాడుతున్నారు. ఎంత తీవ్రత తాళలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. దాహంతో మూగ జీవాలు అల్లాడుతున్నాయి.. ముఖ్యంగా.. పాములు జనావాసాల్లోకి వస్తుండటంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా, తిరుమలో ఓ నాగుపాము హల్ చల్ చేసింది..
- Raju M P R
- Updated on: Apr 16, 2026
- 2:13 pm
Tirumala: ఈ వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి మారనున్న దర్శనం రూల్స్.. కొత్త విధానం అమలు..
తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ వేసవిలో వెళ్తున్నారా.. అయితే మీకు అలర్ట్. మే 1 నుంచి కొత్త దర్శనం రూల్స్ ప్రవేశపెట్టేందుకు టీటీడీ సిద్దమవుతోంది. వీఐపీ బ్రేక్ దర్శనానిని రద్దు చేయాలని భావిస్తోంది. అలాగే ఎస్ఎస్డీ టోకెన్ల జారీని కూడా నిలిపివేయనుంది తెలుస్తోంది.
- Venkatrao Lella
- Updated on: Apr 14, 2026
- 12:28 pm
Indian Railways: సమ్మర్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి శుభవార్త..
ఈ వేసవిలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మీకు శుభవార్త. తిరుమల వెళ్లేవారి కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చింది. స్కూల్స్, కాలేజీలకు సమ్మర్ హాలీడేస్ కావడంతో పెద్ద సంఖ్యలో తిరుమల దర్శనానికి రద్దీ పెరిగింది. దీంతో ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చారు.
- Venkatrao Lella
- Updated on: Apr 11, 2026
- 1:36 pm
Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నేరుగా మీ వద్దకే.. టీటీడీ సరికొత్త నిర్ణయం
భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టీటీడీ సరికొత్త ఆలోచన చేసింది. ఎండ ప్రభావం క్రమంలో భక్తులు ఇబ్బంది పడకుండా సరికొత్త నిర్ణయం తీసుకుంది. తిరుమలలో త్రాగునీరు కోసం భక్తులు ఇబ్బంది పడకూడదని టీీటీడీ భావిస్తోంది. అందులో భాగంగా నేరుగా భక్తుల వద్దకే వెళ్లి అందించనుంది.
- Venkatrao Lella
- Updated on: Apr 9, 2026
- 8:25 am