AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను నిర్వహించే ఓ స్వతంత్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటీష్ హయాంలో 1933లో టీటీడీ తొలి పాలకమండి ఏర్పాటయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి ఇదే కావడం విశేషం. 2024నాటికి టీటీడీ ఆస్తుల విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు టీటీడీ సొంతం. టీటీడీలో ప్రస్తుతం 16 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ 2019లో శ్రీవాణి ట్రస్టును నెలకొల్పింది. కొత్త ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ చేపట్టే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. దీని ద్వారా దేశ విదేశాల్లో పలు కొత్త ఆలయాలను నిర్మించారు

ఇంకా చదవండి

Indian Railways: సమ్మర్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి శుభవార్త..

ఈ వేసవిలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మీకు శుభవార్త. తిరుమల వెళ్లేవారి కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చింది. స్కూల్స్, కాలేజీలకు సమ్మర్ హాలీడేస్ కావడంతో పెద్ద సంఖ్యలో తిరుమల దర్శనానికి రద్దీ పెరిగింది. దీంతో ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చారు.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నేరుగా మీ వద్దకే.. టీటీడీ సరికొత్త నిర్ణయం

భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టీటీడీ సరికొత్త ఆలోచన చేసింది. ఎండ ప్రభావం క్రమంలో భక్తులు ఇబ్బంది పడకుండా సరికొత్త నిర్ణయం తీసుకుంది. తిరుమలలో త్రాగునీరు కోసం భక్తులు ఇబ్బంది పడకూడదని టీీటీడీ భావిస్తోంది. అందులో భాగంగా నేరుగా భక్తుల వద్దకే వెళ్లి అందించనుంది.

టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు..

శ్రీవారి ప్రాశస్త్యం దేశవ్యాప్తం చేయాలని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నిర్ణయించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణం చేపట్టాలని భావించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల రాజధానుల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో వడివడిగా అడుగులేస్తోంది.

Tirumala: ఆ భక్తుడి ఒళ్లంతా బంగారమే.. తిరుమలలో గోల్డ్‌మ్యాన్ సందడి.. ఇదిగో వీడియో

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన హైదరాబాద్ కు చెందిన సూర్య ఒంటి నిండా బంగారు ఆభరణాలతో వచ్చి భక్తులను ఆకట్టుకున్నారు. మెడలో కిలోల కొద్దీ బంగారు గొలుసులు, చేతికి అరుదైన కడియంతో కనిపించారు. గతంలో దేశంలో ఎవరికీ లేని బంగారు కడియాన్ని ధరించాలన్న మొక్కును శ్రీవారి దయతో తీర్చుకున్నట్లు ఆయన తెలిపారు.

Tirumala: రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా తిరుమల శ్రీవారి దర్శనం.. భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం.. ఎలా అంటే..?

తిరుమల వెళ్లేవారికి టీటీడీ మంచి అవకాశం కల్పిస్తోంది. రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం మీకు కల్పించనుంది. ఇందుకోసం కొత్త విధానం తీసుకొచ్చింది. అదే దివ్యానుగ్రహ విశేష హోమం. ఇందులో ఎలా పాల్గొనాలి.. శ్రీవారిని ఎలా దర్శించుకోవాలి అనేది చూద్దాం.

ఓరీ దేవుడో.. తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!

తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన రెండు భారీ పాములు భక్తులను భయాందోళనలకు గురిచేశాయి. శ్రీవారి దర్శనం కోసం శిలాతోరణం వరకు విస్తరించిన క్యూ లైన్ల సమీపంలో ఈ పాములు కనిపించాయి. సుమారు 8 అడుగులు మరియు 6 అడుగుల పొడవు ఉన్న ఈ రెండు పాములు రోడ్డుపై సంచరిస్తూ భక్తుల కంటపడ్డాయి. గోవింద నామ స్మరణతో భక్తి పారవశ్యంలో ఉన్న భక్తులు, ఒక్కసారిగా పాములను చూసి భయంతో పరుగులు తీశారు.

శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్..ప్రత్యేకతలు ఇవే!

శ్రీవారి లడ్డూ ప్రసాదం అన్నప్రసాదాల నాణ్యతను అత్యున్నత ప్రమాణాలతో పరీక్షించేందుకు తిరుమలలో టీటీడీ ఏర్పాటు చేసింది. అత్యాధునిక FSSAI ల్యాబ్ సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ల్యాబ్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. నెయ్యి తోపాటు ఇతర దినుసుల్లో కల్తీని అత్యంత సూక్ష్మమైన PPT స్థాయిలో కూడా పసిగట్టగలిగే సామర్థ్యం ల్యాబ్ సొంతం.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మరికొన్ని లగేజీ కేంద్రాలు.. ఎక్కడంటే..?

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమలలో లగేజీ కేంద్రాలపై కీలక అప్టేట్ వచ్చింది. ఇప్పటికే భక్తులు తమ సామాన్లను భద్రపర్చుకునేందుకు కొన్ని లగేజీ కేంద్రాలు ఉండగా.. ఇప్పుడు అదనంగా మరికొన్ని అందుబాటులోకి తెచ్చారు. లగేజీ డిపాజిట్, డెలివరీ కేంద్రాలను ప్రారంభించారు.

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి తీపికబురు.. ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్ల జారీపై అప్డేట్ వచ్చేసింది..

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. టీటీడీ ప్రతీ నెలా ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జూన్ నెల కోటాకు సంబంధించిన టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తామనే దానిపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ మరో కీలక ప్రకటన.. త్వరలో అందుబాటులోకి..

తిరుమలలో త్వరలో మరో అన్నప్రసాద కేంద్రం అందుబాటులోకి రానుంది. రిలయన్స్ సంస్థ సహాకారంతో దీనిని నిర్మించనుంది. ఈ మేరకు టీటీడీ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇప్పటికే తిరుమలలో పలుచోట్ల అన్నప్రసాద కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు భక్తుల కోసం మరోకటి అందుబాటులోకి తీసుకురానున్నారు.

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి కొత్త రూల్స్.. టైమింగ్స్‌పై టీటీడీ కఠిన నిర్ణయం.. ఇక నుంచి..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారా..? అయితే మీకో అలర్ట్. టీటీడీ దర్శనాలకు సంబంధించి కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి దర్శనం టికెట్‌లో ఏ టైమ్ అయితే ఉందో.. ఆ టైమ్‌కి మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ముందుగా వెళ్లడానికి అనుమతి ఉండదు.

Rukmini Vasanth: తిరుమలలో ‘కాంతారా 2’ హీరోయిన్.. రుక్మిణీ వసంత్‌కు ఇంత అందమైన చెల్లెలు ఉందా? వీడియో

సప్తసాగరాలు దాటి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్. దీని తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా ఆడలేదు. అయితే రిషభ్ శెట్టి నటించిన కాంతారా 2 సినిమాలో రుక్కూ యాక్టింగ్ కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు.