తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను నిర్వహించే ఓ స్వతంత్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటీష్ హయాంలో 1933లో టీటీడీ తొలి పాలకమండి ఏర్పాటయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి ఇదే కావడం విశేషం. 2024నాటికి టీటీడీ ఆస్తుల విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు టీటీడీ సొంతం. టీటీడీలో ప్రస్తుతం 16 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ 2019లో శ్రీవాణి ట్రస్టును నెలకొల్పింది. కొత్త ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ చేపట్టే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. దీని ద్వారా దేశ విదేశాల్లో పలు కొత్త ఆలయాలను నిర్మించారు
ఓరీ దేవుడో.. తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన రెండు భారీ పాములు భక్తులను భయాందోళనలకు గురిచేశాయి. శ్రీవారి దర్శనం కోసం శిలాతోరణం వరకు విస్తరించిన క్యూ లైన్ల సమీపంలో ఈ పాములు కనిపించాయి. సుమారు 8 అడుగులు మరియు 6 అడుగుల పొడవు ఉన్న ఈ రెండు పాములు రోడ్డుపై సంచరిస్తూ భక్తుల కంటపడ్డాయి. గోవింద నామ స్మరణతో భక్తి పారవశ్యంలో ఉన్న భక్తులు, ఒక్కసారిగా పాములను చూసి భయంతో పరుగులు తీశారు.
- Raju M P R
- Updated on: Mar 21, 2026
- 8:53 am
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్..ప్రత్యేకతలు ఇవే!
శ్రీవారి లడ్డూ ప్రసాదం అన్నప్రసాదాల నాణ్యతను అత్యున్నత ప్రమాణాలతో పరీక్షించేందుకు తిరుమలలో టీటీడీ ఏర్పాటు చేసింది. అత్యాధునిక FSSAI ల్యాబ్ సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ల్యాబ్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. నెయ్యి తోపాటు ఇతర దినుసుల్లో కల్తీని అత్యంత సూక్ష్మమైన PPT స్థాయిలో కూడా పసిగట్టగలిగే సామర్థ్యం ల్యాబ్ సొంతం.
- Raju M P R
- Updated on: Mar 21, 2026
- 8:35 am
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మరికొన్ని లగేజీ కేంద్రాలు.. ఎక్కడంటే..?
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమలలో లగేజీ కేంద్రాలపై కీలక అప్టేట్ వచ్చింది. ఇప్పటికే భక్తులు తమ సామాన్లను భద్రపర్చుకునేందుకు కొన్ని లగేజీ కేంద్రాలు ఉండగా.. ఇప్పుడు అదనంగా మరికొన్ని అందుబాటులోకి తెచ్చారు. లగేజీ డిపాజిట్, డెలివరీ కేంద్రాలను ప్రారంభించారు.
- Venkatrao Lella
- Updated on: Mar 19, 2026
- 2:05 pm
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి తీపికబురు.. ఆన్లైన్లో దర్శనం టికెట్ల జారీపై అప్డేట్ వచ్చేసింది..
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. టీటీడీ ప్రతీ నెలా ఆన్లైన్లో దర్శనం టికెట్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జూన్ నెల కోటాకు సంబంధించిన టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తామనే దానిపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
- Venkatrao Lella
- Updated on: Mar 17, 2026
- 7:14 am
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ మరో కీలక ప్రకటన.. త్వరలో అందుబాటులోకి..
తిరుమలలో త్వరలో మరో అన్నప్రసాద కేంద్రం అందుబాటులోకి రానుంది. రిలయన్స్ సంస్థ సహాకారంతో దీనిని నిర్మించనుంది. ఈ మేరకు టీటీడీ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇప్పటికే తిరుమలలో పలుచోట్ల అన్నప్రసాద కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు భక్తుల కోసం మరోకటి అందుబాటులోకి తీసుకురానున్నారు.
- Venkatrao Lella
- Updated on: Mar 15, 2026
- 10:53 am
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి కొత్త రూల్స్.. టైమింగ్స్పై టీటీడీ కఠిన నిర్ణయం.. ఇక నుంచి..
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారా..? అయితే మీకో అలర్ట్. టీటీడీ దర్శనాలకు సంబంధించి కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి దర్శనం టికెట్లో ఏ టైమ్ అయితే ఉందో.. ఆ టైమ్కి మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ముందుగా వెళ్లడానికి అనుమతి ఉండదు.
- Venkatrao Lella
- Updated on: Mar 10, 2026
- 9:27 pm
Rukmini Vasanth: తిరుమలలో ‘కాంతారా 2’ హీరోయిన్.. రుక్మిణీ వసంత్కు ఇంత అందమైన చెల్లెలు ఉందా? వీడియో
సప్తసాగరాలు దాటి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్. దీని తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా ఆడలేదు. అయితే రిషభ్ శెట్టి నటించిన కాంతారా 2 సినిమాలో రుక్కూ యాక్టింగ్ కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు.
- Basha Shek
- Updated on: Mar 6, 2026
- 5:54 pm
Divvala Madhuri: తిరుమలలో మరోసారి దివ్వల మాధురి అత్యుత్సాహం.. ఏం చేసిందో తెలుసా? వీడియో ఇదిగో
బిగ్ బాస్ ఫేమ్ దివ్వల మాధురి మరోసారి వార్తల్లో నిలిచింది. పవిత్రమైన తిరుమల కొండపై ఆమె చేసిన ఒక పని ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది. దీనిపై శ్రీవారి భక్తులు కూడా మండిపడుతున్నారు. అదే సమయంలో టీటీడీ విజిలెన్స్ కూడా ఈ ఘటనపై ఆరా తీస్తోంది.
- Basha Shek
- Updated on: Mar 5, 2026
- 6:43 pm
Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. ఈ నెలలోనే కొత్త సేవలు.. ఇక నుంచి నేరుగా..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రైళ్ల ద్వారా వేలామంది భక్తులు తిరుపతికి చేరుకుంటూ ఉంటారు. దీని వల్ల తిరుపతి స్టేషన్లలో రద్దీ కారణంగా భక్తులు అవస్థలు పడుతున్నారు. ప్రయాణికులకు తగ్గట్లు స్టేషన్లలో సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ను సర్వాంగ సుందరంగా మార్చే పనులు జరుగుతున్నాయి.
- Venkatrao Lella
- Updated on: Mar 4, 2026
- 11:34 am
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నేడు శ్రీవారి ఆలయం బంద్.. తిరిగి దర్శనాలు అప్పుడే..
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. నేడు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. చంద్రగ్రహణమే ఇందుకు కారణం. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ప్రతీసారి మూసివేస్తూ ఉంటారు. ఆలయ తలుపులను క్లోజ్ చేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత మళ్లీ తలుపులు తెలిసి దర్శనానికి అవకాశం కల్పిస్తారు
- Venkatrao Lella
- Updated on: Mar 3, 2026
- 7:58 am
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శన టికెట్ల జారీ బంద్.. ఎన్ని రోజులంటే..?
చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న శ్రీవారి ఆలయం మూతపడనుంది. ఈ క్రమంలో దర్శనాలు ఆ రోజు బంద్ కానున్నాయి. మార్చి 2,3వ తేదీలకు ఎస్ఎస్డీ టోకెన్ల జారీని నిలిపివేయనున్నారు. తిరిగి మార్చి 3వ తేదీన టోకెన్ల జారీని ప్రారంభిస్తారు. ఈ మేరకు టీటీడీ కీలక ప్రకటన జారీ చేసింది.
- Venkatrao Lella
- Updated on: Mar 2, 2026
- 7:48 am
Geetu Royal: ఛీ..ఛీ.. తిరుమలలో ఇలాంటి పనులా? బిగ్బాస్ ఫేమ్ గీతూపై భక్తుల తీవ్ర ఆగ్రహం.. వీడియో ఇదిగో
పవిత్రమైన తిరుమల శ్రీవారి క్షేత్రంలో కొందరు సెలబ్రిటీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. టీటీడీ అధికారులు ఎంతగా హెచ్చరిస్తున్నా వినకుండా ఓవరాక్షన్ చేస్తున్నారు. తద్వారా హిందూ భక్తుల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా బిగ్ బాస్ తెలుగు ఫేమ్ గీతూ రాయల్ తిరుమలలో చేసిన ఓ పని తీవ్ర వివాదాస్పదమవుతోంది
- Basha Shek
- Updated on: Feb 28, 2026
- 4:49 pm