AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను నిర్వహించే ఓ స్వతంత్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటీష్ హయాంలో 1933లో టీటీడీ తొలి పాలకమండి ఏర్పాటయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి ఇదే కావడం విశేషం. 2024నాటికి టీటీడీ ఆస్తుల విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు టీటీడీ సొంతం. టీటీడీలో ప్రస్తుతం 16 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ 2019లో శ్రీవాణి ట్రస్టును నెలకొల్పింది. కొత్త ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ చేపట్టే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. దీని ద్వారా దేశ విదేశాల్లో పలు కొత్త ఆలయాలను నిర్మించారు

ఇంకా చదవండి

TTD: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు దర్శన టికెట్ల జారీ రద్దు!

TTD Stopped Srivani Darshan Tickets For 3 Days: శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లే భక్తులు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి, క్రిస్‌మస్ వరుస సెలవుల నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని భక్తులు శ్రీవారి దర్శననానికి క్యూకట్టారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటలు పడుతుంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Anand T
  • Updated on: Dec 26, 2025
  • 6:58 am

ఇక.. విదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు.. గ్లోబల్ గుర్తింపు దిశగా టీటీడీ అడుగులు

టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు బృహత్తర ప్రణాళికను రూపొందించింది. సీఎం చంద్రబాబు సూచనలతో, శ్రీవారి ఆలయాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పాలకమండలి కసరత్తు చేస్తోంది. నిపుణుల కమిటీ చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసింది. త్వరలోనే వివిధ దేశాల్లో శ్రీనివాసుడి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. విదేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు అనుగుణంగా, తిరుమల తరహాలో ఆగమశాస్త్ర పూజలతో ఆలయాలను నిర్మిస్తారు.

  • Phani CH
  • Updated on: Dec 24, 2025
  • 1:51 pm

TTD: పెళ్లి చేసుకోబోయే కొత్త జంటలకు టీటీడీ గుడ్‌న్యూస్.. అడ్రస్ పంపితే చాలు ఫ్రీగా..

కొత్తగా పెళ్లి చేసుకొని జీవితాన్ని ప్రారంభించబోయే జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. కొత్తగా పెళ్లైన వధూవరులు తమ పూర్తి చిరునామాతో శుభలేఖలు టీటీడీకి పంపితే.. శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకంతో పాటు ప్రసాదంను పోస్టులో పంపనుంది.

Tirumala Trains: తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ భారీ గుడ్‌న్యూస్.. ప్రయాణం మరింత సులువుగా..

త్వరలో వరుస పండుగల కారణంగా రైల్వేశాఖ ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగా మరో మూడు సర్వీసులను ప్రవేశపెట్టింది. తిరుపతి, మచిలిపట్నం, ప్రయోగరాజ్ మధ్య మూడు ప్రత్యేక ట్రైన్లను తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక రైళ్ల టైమింగ్స్, ఎక్కడెక్కడ ఆగుతాయి? అనే వివరాలు చూద్దాం.

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ, బెంగాలీ సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది. అలాగే బిగ్ బాస్ తెలుగు తో పాటు పలు టీవీ షోల్లోనూ సందడి చేసింది. అయితే ఈ అందాల తార ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.

TTD: భక్తుల సేవలపై టీటీడీ కీలక నిర్ణయం.. మరింతగా మెరుగుపరిచేందుకు ప్లాన్

తిరుమల భక్తుల సేవల నాణ్యతను పెంచడానికి టీటీడీ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీఎం ఆదేశాల మేరకు, భక్తుల నుంచి విస్తృతంగా అభిప్రాయ సేకరణకు ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకులు, డైరెక్ట్ సర్వేలు వంటి బహుళ మాధ్యమాలను ఉపయోగిస్తోంది. అన్నప్రసాదం, వసతి, ఆలయ అనుభవంతో సహా 17 అంశాలపై అభిప్రాయాలు సేకరించి, వాటిని విశ్లేషించి తిరుమల యాత్ర అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యం.

  • Phani CH
  • Updated on: Dec 13, 2025
  • 1:22 pm

శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్.. ఎలా బయటపడిందంటే..?

టీటీడీ పట్టు వస్త్రాల కొనుగోళ్లలో 54 కోట్ల రూపాయల భారీ అవినీతి బయటపడింది. స్వామివారికి, VIPలకు వాడే పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్ అంటగట్టారు. టీటీడీ అంతర్గత విచారణలో ఈ మోసం వెల్లడి కావడంతో, విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీకి కేసు అప్పగించాలని నిర్ణయించారు. ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

  • Phani CH
  • Updated on: Dec 13, 2025
  • 1:08 pm

శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్.. ఎలా బయటపడిందంటే..?

టీటీడీ పట్టు వస్త్రాల కొనుగోళ్లలో 54 కోట్ల రూపాయల భారీ అవినీతి బయటపడింది. స్వామివారికి, VIPలకు వాడే పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్ అంటగట్టారు. టీటీడీ అంతర్గత విచారణలో ఈ మోసం వెల్లడి కావడంతో, విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీకి కేసు అప్పగించాలని నిర్ణయించారు. ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

  • Phani CH
  • Updated on: Dec 13, 2025
  • 7:32 am

Tirumala: తిరుమల శ్రీవారికి భక్తురాలు కోటి విరాళం..

చెన్నై భక్తురాలు సౌమ్య టీటీడీ ట్రస్టులకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. అన్నప్రసాదం, ప్రాణదానం ట్రస్టులకు సమానంగా చెక్కు అందజేశారు. అలాగే, చెన్నైకి చెందిన లోటస్ ఆటో వర్డ్ భక్తులు శ్రీవారి సేవకు రూ.10 లక్షల విలువైన రెండు ఎలక్ట్రిక్ కార్లను విరాళంగా సమర్పించారు. భక్తుల ఉదారతకు టీటీడీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

  • Phani CH
  • Updated on: Dec 12, 2025
  • 6:51 pm

గుడిలో దొంగలుపడ్డారు.. భగవంతుడిపై భక్తి లేదు.. అమ్మోరంటే భయం లేదు..

'కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ... తెట్టలాయ మహిమలే తిరుమల కొండ'... అన్నమయ్య ఎంత ఆర్తితో కీర్తించాడో ఆ తిరుమల కొండని. 'ఎదురుగా ఉన్నది కొండే అనుకుంటున్నావేమో, కాదు అది సాక్షాత్తు వైకుంఠం ' అని ఎలుగెత్తి పాడారు ఆ పదకవితా పితామహుడు. నాలుగు వేదాలే శిలలుగా ఆ తిరుమల కొండ పుట్టిందన్నాడు. అందులోని ప్రతి పదార్థం, అణవణువూ పరమ పవిత్రం.

నవంబర్‌లో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గత కొన్ని నెలలుగా గణనీయంగా పెరుగుతోంది. నవంబర్ నెలలో ఇది రూ. 116 కోట్లకు పైగా రికార్డు సృష్టించింది. 21 లక్షలకు పైగా భక్తులు వెంకన్నను దర్శించుకోగా, 7.7 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీ, కానుకలు పెరగడంతో శ్రీవారి ఆదాయం ఏటేటా కొత్త శిఖరాలను చేరుకుంటోంది. టీటీడీ కూడా భక్తులకు చక్కటి సేవలు అందించింది.

  • Phani CH
  • Updated on: Dec 11, 2025
  • 4:10 pm

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో ఇద్దరికి కస్టడీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు మరో ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. టీవీ9 నివేదించిన ఈ సమాచారం ప్రకారం, టీటీడీకి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతపై తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతోంది. ఇది కేసులో కీలక పరిణామం.

  • Phani CH
  • Updated on: Dec 9, 2025
  • 4:23 pm