తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను నిర్వహించే ఓ స్వతంత్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటీష్ హయాంలో 1933లో టీటీడీ తొలి పాలకమండి ఏర్పాటయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి ఇదే కావడం విశేషం. 2024నాటికి టీటీడీ ఆస్తుల విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు టీటీడీ సొంతం. టీటీడీలో ప్రస్తుతం 16 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ 2019లో శ్రీవాణి ట్రస్టును నెలకొల్పింది. కొత్త ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ చేపట్టే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. దీని ద్వారా దేశ విదేశాల్లో పలు కొత్త ఆలయాలను నిర్మించారు
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రికార్డు స్థాయిలో స్పందన
తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది. 1.8 లక్షల టోకెన్లకు 24 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు పది రోజుల దర్శనాల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్ డిప్ పద్ధతిలో టికెట్లు కేటాయించారు. సామాన్య భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ప్రకటించింది.
- Phani CH
- Updated on: Dec 4, 2025
- 8:41 pm
TTD: టీటీడీ సంచలన నిర్ణయం..
టీటీడీ తిరుమల తరహాలో ఇతర ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణను విస్తరించనుంది. ఈ నెల 31 నుంచి మరో 19 ఆలయాల్లో అన్నప్రసాద పంపిణీ ప్రారంభమవుతుంది. 2026 నాటికి అన్ని ఆలయాల్లో భక్తులకు రుచికరమైన, శుచియైన అన్నప్రసాదాలు అందించడానికి టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, నాణ్యత పర్యవేక్షణ, కీలక పరిపాలనా సంస్కరణలు చేపట్టనుంది.
- Phani CH
- Updated on: Dec 4, 2025
- 8:34 pm
Tirumala Laddu Case: టీటీడీ ఉద్యోగుల్లో భయం భయం.. కల్తీ నెయ్యి కేసులో నెక్స్ట్ అరెస్టయ్యేది ఎవరు..?
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కథ తెల్చే పనికి వేళయింది. కల్తీ నెయ్యి కేసు నిజాలు తేల్చే పనిలో ఉన్న సిట్ ఫైనల్ చార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది. ఇప్పటికే 29 మంది నిందితులను కేసులో చేర్చి పలువురిని విచారించిన సిట్ 9 మందిని అరెస్టు చేసింది. మరికొద్ది మందిని నిందితులుగా చేర్చేందుకు మెమోలు దాఖలు చేసింది.
- Raju M P R
- Updated on: Nov 30, 2025
- 9:28 am
Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వాట్సప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్.. ఎలాగంటే..
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి భక్తులకు తెలియజేసింది. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని స్పష్టం చేసింది.
- Raju M P R
- Updated on: Nov 26, 2025
- 5:58 am
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వచ్చే ఫిబ్రవరిలో దర్శనం కోటా విడుదల అప్పుడే..!
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల కోసం ఎదురుచూస్తున్న భక్తుల కోసం ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలను ప్రకటించింది. 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే పలు రకాల దర్శనాలు, గదుల కోటా వివరాలపై టీటీడీ స్పష్టత ఇచ్చింది. TTD వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరుతోంది.
- Raju M P R
- Updated on: Nov 17, 2025
- 11:30 am
Andhra: టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్కుమార్ది హత్యే.. కేసు నమోదు చేసిన పోలీసులు..
పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు, TTD మాజీ AVSO సతీష్కుమార్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా కోమలి దగ్గర సతీష్కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మొన్న రాత్రి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కిన సతీష్కుమార్.. నిన్న ఉదయం రైల్వేట్రాక్పై ఆయన మృతదేహం లభ్యమవడం అనుమానాలకు తావిస్తోంది. ఇంతకీ.. ఏం జరిగింది?.. సతీష్కుమార్ మృతిపై పోలీసుల వర్షెనేంటి...?
- Shaik Madar Saheb
- Updated on: Nov 15, 2025
- 9:28 am
Watch: రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ హీరోనే.. తిరుమలలో ఆ నటుడు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..
శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన తమిళ హీరో అజిత్.. ఆలయం ముందు అభిమాని కోరిక తీర్చాడు. ఒకవైపు వర్షం కురుస్తుండగా శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన అజిత్ తో ఫోటో దిగేందుకు ఒక యువకుడు ఆసక్తి చూపాడు. ఆలయం ముందు భక్తులతో మాట్లాడుతుండగా.. మూగ చెవిటి అయిన ఒక యువకుడు అజిత్తో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు.
- Raju M P R
- Updated on: Oct 28, 2025
- 1:58 pm
Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్ చెల్లెలు.. ఎంత క్యూట్గా ఉందో చూశారా? ఫొటోస్ ఇదిగో
తిరుమల కొండపై హీరో ప్రభాస్ చెల్లి సాయి ప్రదీప్తి తళుక్కుమంది. వెంకన్నకు మొక్కులు చెల్లించింది. ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రవల్లికతో కలిసి ప్రభాస్ చెల్లి సాయి ప్రదీప్తి శ్రీవారిని దర్శించుకుంది. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన సాయి ప్రదీప్తి ని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు
- Raju M P R
- Updated on: Oct 27, 2025
- 10:40 pm
Tollywood: మోకాళ్లపై తిరుమల శ్రీవారి కొండ ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?
గతంలో చాలా సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుందీ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. అయితే ఈసారి మోకాళ్లపై తిరుమల కొండను ఎక్కిందీ అందాల తార. గోవింద గోవింద అంటూ శ్రీవారి సన్నిధికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Basha Shek
- Updated on: Oct 27, 2025
- 7:19 pm
వెంకన్నకు విరాళాల వెల్లువ..11 నెలల్లో రూ.918 కోట్లు
తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. అందుకే ఆయనకు వెల కట్టలేని ఆభరణాలు ఉన్నా.. భక్తులు తమ భక్తి కొలదీ రకరకాల ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పిస్తుంటారు. అలా శ్రీనివాసునికి గత 11 నెలల్లో విరాళాలు వెల్లువెత్తాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడు దాకా దేశ విదేశాల్లోని భక్తులు సమర్పించే కానుకలు దాతలు ఇచ్చే విరాళాలు తిరుమలేశుడి ఆదాయాన్ని గణనీయంగా పెంచుతున్నాయి.
- Phani CH
- Updated on: Oct 25, 2025
- 12:01 pm