తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను నిర్వహించే ఓ స్వతంత్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటీష్ హయాంలో 1933లో టీటీడీ తొలి పాలకమండి ఏర్పాటయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి ఇదే కావడం విశేషం. 2024నాటికి టీటీడీ ఆస్తుల విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు టీటీడీ సొంతం. టీటీడీలో ప్రస్తుతం 16 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ 2019లో శ్రీవాణి ట్రస్టును నెలకొల్పింది. కొత్త ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ చేపట్టే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. దీని ద్వారా దేశ విదేశాల్లో పలు కొత్త ఆలయాలను నిర్మించారు
Tirumala: తిరుమల భక్తులకు ఇకపై నాణ్యమైన ఆహారం.. టీటీడీ కీలక నిర్ణయం.. మార్చి నుంచే..
తిరుమల లడ్డూ కల్తీ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతూనే ఉంది. ఇటీవల కేబినెట్ సమావేశంలో కూడా దీనిపై కీలక చర్చ జరిగింది. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు కల్తీ లేని ఆహారం అందించేందుకు త్వరలో ల్యాబ్ ఏర్పాటుకు సిద్దమవుతోంది.
- Venkatrao Lella
- Updated on: Feb 5, 2026
- 8:25 am
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు ఈ సేవలు బంద్..
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. ఫిబ్రవరి 26 నుంచి సాలకట్ల తెప్పోత్సవాలు తిరుమలలోని పుష్కరిణిలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐదు రోజుల పాటుప పలు సేవలను రద్దు చేయనుంది. ఆ వివరాలు..
- Venkatrao Lella
- Updated on: Feb 3, 2026
- 11:21 am
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి మరింత వేగంగా స్వామివారి దర్శనం.. తగ్గనున్న వెయిటింగ్..
తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త. ఇక నుంచి స్వామివారి దర్శనం వేగంగా జరగనుంది. ఇందుకోసం ఏఐ ఆధారిత ఫేష్ రికగ్నేషన్ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. అలాగే ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇందుకు సహాయపడనుంది. వీటి వల్ల గత రెండు నెలలుగా స్వామివారి దర్శనం వేగంగా జరుగుతోంది.
- Venkatrao Lella
- Updated on: Feb 2, 2026
- 12:33 pm
Alipiri Mandapam: టీటీడీ కీలక నిర్ణయం.. అలిపిరి మండపానికి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేలా..
Tirumala Tirupati Devasthanams: పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు టీటీడీ చేపట్టింది. తిరుమల క్షేత్రంలోని 1000ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన కట్టడాలు రాత్రి మండపాలు మెట్ల మార్గాలను పధిల పరుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే తిరుపతిలోని పాదాల మండపానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పునరుద్ధరణ పనులను చేపట్టింది.
- Raju M P R
- Updated on: Jan 30, 2026
- 10:55 am
తిరుమల కల్తీ నెయ్యి కేసు: 2021 నుంచి కొండపై ఏం జరిగింది..? సీబీఐ-సిట్ రిపోర్ట్ ఏం తేల్చింది..
2021 నుంచి 2024 మధ్య జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై మాత్రమే సీబీఐ-సిట్ ఎందుకని ఎంక్వైరీ చేసింది? ఆ పిరియడ్ను మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకుంది? 2019కు ముందు కాలాన్ని ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు? ఎందుకంటే.. 2020 ఫిబ్రవరి 29న తీర్మానం నంబర్ 371 ద్వారా టీటీడీ పాలక మండలి అధికారికంగా కొన్ని మార్పులు చేసింది.
- Shaik Madar Saheb
- Updated on: Jan 29, 2026
- 9:49 pm
Tirumala Laddu Case: కీలక సూత్రధారులు వారే.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు..
టీటీడీ కల్తీ నెయ్యి కథ ఎట్టకేలకు ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేలా చేసింది. 16 నెలల విచారణ 36 మందిని నిందితుల్ని చేసింది. 10కిపైగా రాష్ట్రాల్లో జరిగిన సిట్ ఎంక్వయిరీ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పొలిటికల్ గా కూడా హీట్ పుట్టించిన టీటీడీ నెయ్యి కేసు ఎంతో మందిని విచారణ కు పిలిపించింది. నెయ్యి సరఫరాలో పలు రాష్ట్రాల డయిరీల అక్రమాలు, టిటిడి ఉద్యోగుల పాత్రను సిట్ ఛార్జ్ షీట్ బయట పెట్టింది. లుక్
- Shaik Madar Saheb
- Updated on: Jan 24, 2026
- 7:50 am
Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు మరో అవకాశం.. తక్కువ ధరలో కాణిపాకం, శ్రీకాళహస్తి ఒకేసారి చూట్టేయొచ్చు..
తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లేవారికి ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ క్రమంలో తిరుమల, తిరుపతి చుట్టుపక్కల ఉన్న పర్యాటక, పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునేవారి కోసం టూరిజం శాఖ, టీటీడీ కలిపి ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చాయి.
- Venkatrao Lella
- Updated on: Jan 23, 2026
- 11:40 am
Tirumala: రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం
రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వ దర్శన టోకెన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్ల ఎప్పటి నుంచి రద్దు చేస్తున్నారు..? రథసప్తమి వాహనసేవల వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి .. .. .. ..
- Raju M P R
- Updated on: Jan 22, 2026
- 10:27 pm
Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
సనాతన ధర్మంలో సూర్యారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మాఘ మాసంలో వచ్చే 'రథ సప్తమి'ని సూర్య జయంతిగా జరుపుకుంటాం. ఈ రోజున సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణం వైపు పయనిస్తాడు. ఈ సంవత్సరం జనవరి 25న జరుపుకోనున్న ఈ పర్వదినాన చేసే దానధర్మాలు నూటికి నూరు రెట్లు పుణ్యాన్ని ఇస్తాయని భక్తుల నమ్మకం. సూర్య కిరణాలు భూమిపై ప్రత్యేక శక్తిని ప్రసరింపజేసే ఈ కాలంలో, మన రాశికి అనుగుణంగా కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది.
- Bhavani
- Updated on: Jan 22, 2026
- 7:22 pm
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు దర్శనాలు బంద్.. ఎందుకంటే..?
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. టీటీడీ కీలక ప్రకటన చేసింది. మూడు రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసింది. అలాగే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని కూడా నిలిపివేయనుంది. భక్తులు దీనిని ముందుగానే గమనించి ప్లాన్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. ఎందుకంటే..?
- Venkatrao Lella
- Updated on: Jan 22, 2026
- 9:11 am
కలియుగ వైకుంఠంలో ఆకలి అనే పదానికి చోటు లేదు.. రోజూ ఎంత మందికి అన్నప్రసాదం అందిస్తారో తెలుసా..?
అది కలియుగ వైకుంఠం.. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం.. అన్నపూర్ణ నిలయంగా శ్రీవారి క్షేత్రం ఆకలికి చోటే లేని పవిత్ర స్థలంగా మారింది. రోజుకు 3 లక్షల మంది భక్తులకు టీటీడీ తృప్తికర భోజనం అందిస్తోంది. వేంకటాద్రి సమః స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి అన్న దైవ స్తోత్రానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.
- Raju M P R
- Updated on: Jan 12, 2026
- 3:00 pm
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ టికెట్ల జారీ రద్దు
శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. జనవరి 9 నుండి శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీ విధానంలో మార్పులు చేసింది. తిరుమలలో ఇప్పటివరకు ఆఫ్లైన్లో జారీ చేసిన 800 శ్రీవాణి టికెట్లను ఆన్లైన్ కరెంట్ బుకింగ్గా మార్చింది. భక్తుల సౌలభ్యం, క్యూలైన్లు తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త విధానం ప్రవేశపెట్టారు. ఆధార్ ధృవీకరణ తప్పనిసరి.
- Phani CH
- Updated on: Jan 10, 2026
- 4:15 pm