Bigg Boss 8: టాస్క్‌లతో హోరెత్తించిన బిగ్ బాస్.. అదరగొట్టిన నిఖిల్

బిగ్ బాస్ ఇప్పుడు మని కోసం టాస్క్ లు ఇచ్చాడు. ఈ టాస్క్ ల్లో గెలిచేందుకు హౌస్ మేట్స్ గట్టిగానే పోటీ పడ్డారు. ఇక హౌస్ లో ఉన్న మూడు టీమ్స్ కు ఆరు గేమ్స్ పెట్టారు బిగ్ బాస్. లెక్కలేనంత డబ్బు గెలుచుకునేందుకు బిగ్‌బాస్ మీకు అవకాశాలు ఇస్తున్నాడు.. 

Bigg Boss 8: టాస్క్‌లతో హోరెత్తించిన బిగ్ బాస్.. అదరగొట్టిన నిఖిల్
Bigg Boss 8
Follow us

|

Updated on: Sep 13, 2024 | 7:47 AM

బిగ్ బాస్ 8 నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కు చిత్ర విచిత్రమైన టాస్క్ లు ఇచ్చారు. మొన్న రేషన్ కోసం టాస్క్ లు ఇచ్చిన బిగ్ బాస్ ఇప్పుడు మని కోసం టాస్క్ లు ఇచ్చాడు. ఈ టాస్క్ ల్లో గెలిచేందుకు హౌస్ మేట్స్ గట్టిగానే పోటీ పడ్డారు. ఇక హౌస్ లో ఉన్న మూడు టీమ్స్ కు ఆరు గేమ్స్ పెట్టారు బిగ్ బాస్. లెక్కలేనంత డబ్బు గెలుచుకునేందుకు బిగ్‌బాస్ మీకు అవకాశాలు ఇస్తున్నాడు..  బిగ్‌బాస్ ఇచ్చిన అవకాశాన్నిసమయానుసారం ఉపయోగించుకొని ఎక్కువ మొత్తాన్ని సంపాదించిన టీమ్ దగ్గర ఉన్న డబ్బు మాత్రమే విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందని చెప్పాడు బిగ్ బాస్. మొదటి గేమ్ లో హౌస్ లో ఉన్న టీవీలో కొందరి పేర్లు చూపించారు. అందులో ఎవరి పేర్లు ఉన్నాయో వారు స్విమింగ్ పూల్ లో దూకాలి అలా దూకిన వారి టీమ్ విన్ అవుతుంది. ఆ టీమ్‌కు 25 వేలు అని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్.

ఇది కూడా చదవండి :దైర్యం ఉంటేనే చూడండి..! థియేటర్ నుంచి జనాలు పారిపోయిన సినిమా ఇది..

దాంతో సోనియా, విష్ణుప్రియ, మణికంఠ పేర్లు ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే పేర్లు డిస్ప్లే అవ్వగానే యష్మీ టీమ్‌ లో ఉన్న పృథ్వీ మణికంఠను గట్టిగా కదలకుండా పట్టుకున్నాడు. ఆతర్వాత సోనియా పరిగెత్తుకుంటూ వెళ్లే క్రమంలో కిందపడిపోయింది. ఇక విష్ణుప్రియ వెళ్లి స్విమింగ్ పూల్ లో దూకేసింది. దాంతో విష్ణు ప్రియా విన్ అయ్యింది. ఆ తర్వాత మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈసారి ఓ రోప్ ఇచ్చి తమకిచ్చిన బాల్స్‌ను ఒక బాస్కెట్‌లో వేయాలి. ఈ టాస్క్ కోసం పృథ్వీ, నబీల్, నిఖిల్‌ పేర్లు డిస్ప్లే చేశారు. ఈ గేమ్ లో ఎక్కువ బాల్స్ ఎవరు వేస్తారో వారే విన్నర్. వారికి రూ. 50 వేళా రూపాయిల అని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్.

ఇది కూడా చదవండి :NTR : మా ఎన్టీఆర్‌నే అంటావా..! నువ్వే మాట్లాడాలి అందం గురించి.. యూట్యూబర్ పై మండిపడ్డ విశ్వక్

ఈ గేమ్ లో నబీల్ రోప్ జారిపోవడంతో అతను గేమ్ నుంచి తప్పుకున్నాడు. ఇక నిఖిల్, పృథ్వీ గట్టిగానే పోటీ పడ్డారు. ఫైనల్ గా నిఖిల్ గెలిచాడు. ఇక మూడో టాస్క్ లో మణికంఠ, యష్మీ, నైనిక పేర్లు సెలక్ట్ చేసి. బిగ్ బాస్ చెప్పిన పదాలకు ఎవరైతే కరెక్ట్ స్పెల్లింగ్స్ రాస్తారో వారే విన్నర్ అని చెప్పాడు. ఈ గేమ్ కు రూ. 70 వేలు అనౌన్స్ చేశారు. ఈ టాస్క్ లో మణికంఠ విన్ అయ్యాడు. నాలుగో అవకాశం విలువ రూ.లక్ష 50 వేలు అని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్.

ఓ గ్లాసులో ముగ్గురు కంటెస్టెంట్లు పల్పీ ఆరెంజ్ బాటిల్‌ను పోస్తారు అయితే ఇలా పొసే క్రమంలో ఎవరి గ్లాస్ నుంచి పల్పీ ఆరెంజ్ లీక్ అవుతుందో వాళ్లు అవుట్ అని చెప్పరు. ఈ టాస్క్ కోసం నిఖిల్, అభయ్, ఆదిత్య ఓంను సెలక్ట్ చేశాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ముందుగా ఆదిత్య అవుట్ అయ్యాడు. నిఖిల్ , అభయ్ ఇద్దరు గట్టిగా పోటీపడ్డారు. దాంతో ఇద్దరికీ టై అయ్యింది. దాంతో చెరో రూ. 75వేలు పంచిపెట్టాడు బిగ్ బాస్. ఆ తర్వాత రూ.50 వేలు అంటూ వ్యాక్స్ చేసుకోవాలని అని చెప్పాడు బిగ్ బాస్. నిఖిల్, నబీల్, పృథ్వీ.. ఈ టాస్క్ లో పోటీపడ్డారు. ఇందులో నబీల్ విన్ అయ్యాడు. ఆ తర్వాత సాక్స్’ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఒకొక్క టీమ్ నుంచి ఇద్దరినీ సెలక్ట్ చేశాడు బిగ్ బాస్. కాలుకి వేసుకున్న సాక్స్‌ను ఎవరైతే చివరి వరకూ ఉంచుకుంటారో వాళ్లు విన్నర్ అని చెప్పాడు. ఈ టాస్క్ లో నిఖిల్, అభయ్ విన్ అయ్యారు. మొత్తంగా నిఖిల్ టీమ్ దగ్గర ఎక్కువగా రూ.2 లక్షల 45 వేలు ఉన్నాయి. యష్మీ టీమ్ దగ్గర రూ.లక్ష 25 వేలు, నైనిక టీమ్ దగ్గర రూ. 1లక్ష ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.