AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల వ్యవహారంపై కీలక కామెంట్స్ చేసిన ఏపీ హైకోర్టు..

ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల వ్యవహారంపై కీలక కామెంట్స్‌ చేసింది, ఏపీ హైకోర్టు. జూలై 2లోగా ఎంవోయూ చేసుకోవాలని, ఎగ్జిబిటర్లకు సూచించింది.

Tollywood: ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల వ్యవహారంపై కీలక కామెంట్స్ చేసిన ఏపీ హైకోర్టు..
Ap
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2022 | 7:08 AM

Share

ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల వ్యవహారంపై కీలక కామెంట్స్‌ చేసింది, ఏపీ హైకోర్టు. జూలై 2లోగా ఎంవోయూ చేసుకోవాలని, ఎగ్జిబిటర్లకు సూచించింది. ఆన్‌లైన్‌ సినిమా టికెట్లపై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎగ్జిబిటర్లు, బుక్‌మై షో పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. జూలై 2లోగా ఎంవోయూ చేసుకోవాలని, ఎగ్జిబిటర్లకు సూచించింది, ఏపీ హైకోర్టు. ఈ ఇష్యూపై జూలై రెండో వారంలో తుది తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర, టెలివిజన్‌, నాటకరంగ అభివృద్ధి సంస్థకు సంబంధించిన యువర్‌ స్క్రీన్స్‌ అనే పోర్టల్‌ ద్వారా, సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేలా ఆ సంస్థ ఏర్పాట్లు చేసింది. బ్లాక్‌ టికెట్ల విధానానికి స్వస్తి పలికి, తక్కువ ధరకే వినోదం అందించేందుకు ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు అధికారులు.

దీని ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకుంటే ధరపై 1.95 శాతం మాత్రమే సేవా రుసుము ఉంటుందని వివరించారు. ఇతర ఆన్‌లైన్‌ పోర్టళ్ల ద్వారా బుక్‌ చేసుకుంటే, ఒక్కో టికెట్‌పై ప్రేక్షకుడికి అదనంగా 20 నుంచి 25 రూపాయల వరకూ భారం పడుతోందని చెప్పారు. APSFTVTDCతో ఒప్పందం చేసుకునే థియేటర్లకు, టికెట్ల డబ్బులు ఏ రోజుకు ఆ రోజు బదలాయించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా థియేటర్లు ఇతర ఆన్‌లైన్‌ పోర్టళ్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దవుతాయనే అపోహలు అక్కర్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఒప్పందాల్లో ఉన్న పోర్టళ్లతో పాటు, ప్రభుత్వం తీసుకొచ్చిన యువర్‌ స్క్రీన్స్‌ ద్వారా కూడా ప్రేక్షకులు టికెట్లు బుక్‌ చేసుకోవొచ్చని చెబుతున్నారు, అధికారులు. ఈ నేపథ్యంలోనే ఎగ్జిబిటర్లు, బుక్‌మై షో ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి :