AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: సౌత్‏లో జాన్వీ డిమాండ్.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన బాలీవుడ్ బ్యూటీ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న NTR30 సినిమాలో జాన్వీ నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభంకాగా... సెకండ్ షెడ్యూల్ లో జాన్వీ సెట్ లో అడుగుపెట్టినున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం జాన్వీ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఏకంగా రూ. 3.5 కోట్లు తారక్ మూవీ కోసం తీసుకుంటుందట.

Janhvi Kapoor: సౌత్‏లో జాన్వీ డిమాండ్.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన బాలీవుడ్ బ్యూటీ..
Janhvi Kapoor
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2023 | 1:32 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించిన జాన్వీ.. ఇప్పుడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న NTR30 సినిమాలో జాన్వీ నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభంకాగా… సెకండ్ షెడ్యూల్ లో జాన్వీ సెట్ లో అడుగుపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం జాన్వీ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఏకంగా రూ. 3.5 కోట్లు తారక్ మూవీ కోసం తీసుకుంటుందట. ఇక అంత మొత్తంలో ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ అయ్యారని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో మూవీ కావడంతో అంత పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమానే కాకుండా తెలుగు చిత్రపరిశ్రమలో జాన్వీకి మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. రెండో సినిమా ఛాన్స్ ఏకంగా మెగా పవర్ స్టార్ సరసన కొట్టేసినట్లుగా సమాచారం. డైరెక్టర్ బుచ్చిబాబు సన.. రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న చిత్రంలో జాన్వీ కథానాయికగా ఎంపికైందట. ఈ నేపథ్యంలో జాన్వీతో ఈ సినిమాకు సంప్రదింపులు జరుపుతున్నారట మేకర్స్. కానీ ఈ సినిమా కోసం ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేస్తుందట. పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే సినిమా కావడంతో ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబుతో చేయబోయే ప్రాజెక్ట్ స్టార్ట్ కానుందట. ఈ ఏడాది అఖరుకు ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి
IIT లేదు.. ప్లేస్‌మెంటూ లేదు.. అయినా రూ.38 లక్షల ప్యాకేజీతో జాబ్!
IIT లేదు.. ప్లేస్‌మెంటూ లేదు.. అయినా రూ.38 లక్షల ప్యాకేజీతో జాబ్!
ఇంటి గోడలపై ఈ వస్తువులు ఉన్నాయా? వాస్తు ప్రకారం వెంటనే తొలగించండి
ఇంటి గోడలపై ఈ వస్తువులు ఉన్నాయా? వాస్తు ప్రకారం వెంటనే తొలగించండి
రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి అదృష్టం కలిసొస్తుంది
రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి అదృష్టం కలిసొస్తుంది
నాన్న చనిపోవడానికి కారణమిదే.. ప్రదీప్ రావత్ కుమారుడు ఎమోషనల్
నాన్న చనిపోవడానికి కారణమిదే.. ప్రదీప్ రావత్ కుమారుడు ఎమోషనల్
పల్లెలోనే కాదు.. నగరాల్లోనూ కొండ చిలువల హల్చల్!
పల్లెలోనే కాదు.. నగరాల్లోనూ కొండ చిలువల హల్చల్!
లైఫ్‌లో రిస్క్ తీసుకోవాలంటే.. 'గట్స్' ఉండాలి: IAS స్మితా సబర్వాల్
లైఫ్‌లో రిస్క్ తీసుకోవాలంటే.. 'గట్స్' ఉండాలి: IAS స్మితా సబర్వాల్
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం..
ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం..
శివలింగం, జ్యోతిర్లింగం ఒకటేనా? రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఇదే!
శివలింగం, జ్యోతిర్లింగం ఒకటేనా? రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఇదే!