
చాలా మంది అందాల భామలు ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా రాణించాలని కోటి ఆశలతో వస్తుంటారు. అవకాశాల కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని హీరోయిన్స్ గా తమ ప్రతిభను చాటుతున్నారు. అయితే చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలను, సమస్యలను ఎదురుకొన్నారు. కొంతమంది హీరోయిన్స్ పలు ఇంటర్వ్యూల్లో తాము కెరీర్ బిగినింగ్ లో ఎదుర్కొన్న సమస్యలను, ఇబ్బందులను పంచుకున్నారు కూడా.. తాజాగా ఓ హీరోయిన్ కూడా తనకు కెరీర్ బిగినింగ్ స్ట్రగుల్స్ ను గుర్తు చేసుకుంది. మోడలింగ్ నుంచి నటిగా మారిన ఆమె ఆ సమయంలో చాలీచాలని డబ్బుతోనే జీవితాన్ని కొనసాగించా అని తెలిపింది. అంతే కాదు తినడానికి తిండి కూడా లేక న్యుడిల్స్ తిని రోజులు గడిపా అని తెలిపింది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఇవే కష్టాలను చూసిందని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
బాలీవుడ్ లో ఎంతో మంది అందాల భామలు ఉన్నారు. వారిలో దియా మీర్జా ఒకరు. ఈ అమ్మడు మోడలింగ్ నుంచి నటిగా మారింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు తెలుగులోనూ ఈ అమ్మడు నటించింది. తన కెరీర్ లో పేరెంట్స్ సపోర్ట్ లేదు అని తెలిపింది. మిగతా హీరోయిన్స్ కు తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటుంది. కానీ తాను మోడలింగ్ చేస్తున్న సమయంలో తల్లి దండ్రులు సపోర్ట్ లేదు అని తెలిపింది.
2000లో నేను, ప్రియాంకా చోప్రా, లారా దత్తా.. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాం .. అయితే ఆ సమయంలో ప్రియాంక చోప్రాకు తన తల్లి సపోర్ట్ చేశారు. కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ సమయంలో ముంబైలో లారా దత్తా ఇరుకు ఇంట్లో ఉండేది. ఆ ఇంట్లోనే నాకు ఉండేదుకు చోటు ఇచ్చింది. ఇద్దరం కలిసి అందులోనే సర్దుకునేవాళ్ళం.. ఫ్యాషన్ షోలో ఖరీదైన దుస్తులు వేసుకునేవాళ్ళం కానీ మా చేతిలో చిల్లు గవ్వ కూడా ఉండేది కాదు. తినడానికి తిండి కూడా ఉండేది కాదు . అప్పట్లో న్యుడిల్స్ తిని రోజులు గడిపాము అని తెలిపింది దియా మీర్జా . ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..