Prakash Raj: ఆ యాడ్ చేశాను.. తప్పు తెలుసుకున్నాను.. నేను ఆన్సర్ ఇవ్వాల్సిందే.. బెట్టింగ్ యాప్స్ పై ప్రకాష్ రాజ్ స్పందన..
బెట్టింగ్ యాప్స్ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్, సినీతారలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు తారలు విచారణకు హాజరయ్యారు. ఈ జాబితాలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పేరు సైతం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనంగా మారింది. ఈ యాప్స్ ప్రచారకర్తలుగా ఉన్న సెలబ్రెటీలపై కేసు నమోదు చేసి విచారణకు పిలుస్తున్నారు పోలీసులు. ఇప్పటికే రీతూ చౌదరి, విష్ణుప్రియ పోలీసుల విచారణకు హాజరై పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అలాగే వారిద్దరి బ్యాంక్ లావాదేవీలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ కేసు జాబితో హీరో విజయ్ దేవరకొండ, నటుడు ప్రకాష్ రాజ్ పేర్లు సైతం ఉన్నాయి. మరోవైపు ఈ యాప్స్ కేసు పై విజయ్ దేవరకొండ పర్సనల్ టీమ్ స్పందించింది. విజయ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదని తెలిపింది. ఇక ఇప్పుడు నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఈ కేసుపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ కేసుల గురించి.. తాను చేసిన యాడ్ గురించి చర్చ జరుగుతుందని.. అందరినీ ప్రశ్నించే తాను ఇప్పుడు సమాధానం చెప్పాలని అన్నారు. అలాంటి ప్రకటన ఎలా చేస్తారని అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు. 2016లో ఆ యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేసిన మాట నిజం. అది తప్పని కొద్ది నెలల్లోనే తెలుసుకున్నాను. 2017లో నా అగ్రిమెంట్ పొడిగిస్తానని వాళ్లు అడిగితే ఆ యాడ్ తెలియక చేశాను. అప్పటికే ఏడాది అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి.. వెంటనే దాన్ని ఆపమని చెప్పలేకపోయాను.. ఆ యాడ్ ప్రసారం చేయొద్దు.. నేను నటించను అని చెప్పాను. తర్వాత ఎలాంటి గేమింగ్ యాప్స్ ప్రచారం చేయలేదు. ఆ కంపెనీ ఇంకో కంపెనీకి 2021వో అమ్మేస్తే.. వాళ్లు సోషల్ మీడియాలో నా ప్రకటన ఉపయోంగించారు. నేను లీగల్ నోటీసులు పంపించాను అంటూ చెప్పుకొచ్చారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..