Watch: బడ్జెట్లో ఈసారైనా తెలంగాణకు న్యాయం చేయాలి: మంత్రి పొన్నం
Union Budget: మోదీ ప్రభుత్వ హయాంలో ప్రతి బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు సాధించేందుకు రాష్ట్ర ఎంపీలు కృషి చేయాలని కోరారు. ఆర్ఆర్ఆర్, మెట్రో ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ఆయన కోరారు.
ప్రతియేటా కేంద్ర బడ్జెట్కు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణకు బడ్జెట్లో సరైన న్యాయం జరిగేలా.. తగిన నిధులు సాధించేలా బీజేపీ ఎంపీలు పనిచేయాలని కోరారు. మొదటి నుంచీ తెలంగాణపై ప్రధాని మోదీకి చిన్నచూపు ఉందని ఆరోపించారు. ఈ సారైనా తెలంగాణకు బడ్జెట్లో న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఆర్ఆర్ఆర్, మెట్రో ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. భారత ఫ్యూచర్ సిటీకి సహకరించాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కేంద్రం సాయం చేయాలని పొన్నం కోరారు.
Follow Us
వైరల్ వీడియోలు
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

