Watch: బడ్జెట్లో ఈసారైనా తెలంగాణకు న్యాయం చేయాలి: మంత్రి పొన్నం
Union Budget: మోదీ ప్రభుత్వ హయాంలో ప్రతి బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు సాధించేందుకు రాష్ట్ర ఎంపీలు కృషి చేయాలని కోరారు. ఆర్ఆర్ఆర్, మెట్రో ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ఆయన కోరారు.
ప్రతియేటా కేంద్ర బడ్జెట్కు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణకు బడ్జెట్లో సరైన న్యాయం జరిగేలా.. తగిన నిధులు సాధించేలా బీజేపీ ఎంపీలు పనిచేయాలని కోరారు. మొదటి నుంచీ తెలంగాణపై ప్రధాని మోదీకి చిన్నచూపు ఉందని ఆరోపించారు. ఈ సారైనా తెలంగాణకు బడ్జెట్లో న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఆర్ఆర్ఆర్, మెట్రో ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. భారత ఫ్యూచర్ సిటీకి సహకరించాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కేంద్రం సాయం చేయాలని పొన్నం కోరారు.
Follow Us
వైరల్ వీడియోలు
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్

