Mahesh Babu: ఆ విషయంలో అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన మహేష్ బాబు.. సూపర్ స్టార్ ఎమోషనల్ పోస్ట్..

ర్కారు వారి పాట సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కర్నూలులో సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రెషన్స్ ఘనంగా నిర్వహించారు

Mahesh Babu: ఆ విషయంలో అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన మహేష్ బాబు.. సూపర్ స్టార్ ఎమోషనల్ పోస్ట్..
Mahesh Babu
Follow us

|

Updated on: May 18, 2022 | 12:44 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వచ్చిన సర్కారు వారి పాట (Mahesh Babu) చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‍గా నిలిచింది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించింది. తెలుగులోనే మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. యూఎస్‏లోనూ రికార్డ్ స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. మహేష్ కెరీర్‏లో విడుదలైన వారం రోజుల్లోనే రూ. 160 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. మరోవైపు సర్కారు వారి పాట సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కర్నూలులో సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రెషన్స్ ఘనంగా నిర్వహించారు మేకర్స్.

సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచినందుకు మహేష్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు మహేష్.. ” సర్కారు వారి పాట చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరు చూపిస్తున్న ప్రేమకు పొంగిపోతున్నాను.. సినిమా విజయం సాధించినందుకు కారణమైన టీం సభ్యులందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎం బీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ఇందులో సముద్రఖని కీలకపాత్రలలో నటించారు.