పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా ,అనుకున్న సమయానికే వస్తుంది.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు హరహర వీరమల్లు అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు హరహర వీరమల్లు అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. మొగలాయిలా కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ లను కూడా రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారు.
హరహర వీరమల్లు సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు. అయితే కరోనా కారణంగా చాలా సినిమాల షూటింగులు వాయిదాపడ్డాయి. అలాగే విడుదల తేదీలను కూడా వాయిదా వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ కూడా సంక్రాంతికి రాకపోవచ్చనే వార్త చక్కర్లు కొట్టింది. ఈ విషయంపై నిర్మాత ఎ.ఎమ్.రత్నం స్పందిస్తూ .. ” క్రిష్ తాను అనుకున్న సమయానికంటే ముందుగానే షూటింగు పూర్తి చేసే దర్శకుడు. పైగా సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది .. అందువలన ‘హరిహర వీరమల్లు’ విడుదలను వాయిదా వేసే పరిస్థితి రాదు. సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది ” అని క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :




