AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ మల్టీస్టారర్‌ కోసం మొదట పవన్, మహేష్‌ను అనుకున్నారట..!

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలకు క్రేజ్‌ బాగా పెరిగింది. ఈ క్రమంలో స్టార్ హీరోలైన పవన్, మహేష్ కలిసి నటిస్తే చూడాలని ఇద్దరి ఫ్యాన్స్‌ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

ఆ మల్టీస్టారర్‌ కోసం మొదట పవన్, మహేష్‌ను అనుకున్నారట..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 30, 2020 | 5:36 PM

Share

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలకు క్రేజ్‌ బాగా పెరిగింది. ఈ క్రమంలో స్టార్ హీరోలైన పవన్, మహేష్ కలిసి నటిస్తే చూడాలని ఇద్దరి ఫ్యాన్స్‌ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్‌ను సెట్ చేసే క్రమంలో ఓ దర్శకుడు ముందడుగు వేశారు. ఇద్దరికీ సెట్ అయ్యేలా ఓ స్టోరీని రాసుకున్నారు. కానీ ఆ సినిమాను ఆ తరువాత ఇద్దరు యంగ్ హీరోలతో చేశారు. ఇంతకు ఆ సినిమా ఏంటి..? ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా..?

మోహన్‌కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన వి చిత్రం. నాని, సుధీర్ బాబులు హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని మొదట పవన్‌, మహేష్‌లతో తీయాలని దర్శకుడు ప్లాన్ చేశారట. కానీ చివరకు నాని, సుధీర్ బాబులతో ఈ మల్టీస్టారర్‌ను తీశారట. ఈ విషయాన్ని సుధీర్ బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దర్శకుడు వి చిత్రం కోసం పవన్, మహేష్ లను అనుకున్నారు.. కానీ తాను, నాని నటించామని తెలిపారు. కాగా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన వి మూవీని దిల్ రాజు నిర్మించగా.. నివేథా థామస్, అదితీ రావు హైదారీ హీరోయిన్లుగా నటించారు. మార్చి 25న ఈ మల్టీస్టారర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో మూవీ విడుదల వాయిదా పడింది. టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: సల్మాన్‌తో మూడోసారి రాక్‌స్టార్..!