సల్మాన్తో మూడోసారి రాక్స్టార్..!
ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ 'రాధే' అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. గత నవంబర్లో సెట్స్ మీదకు ఈ చిత్రం వెళ్లగా.. ఇందులో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తోంది.
ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ‘రాధే’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. గత నవంబర్లో సెట్స్ మీదకు ఈ చిత్రం వెళ్లగా.. ఇందులో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ మూవీకి సంగీతం అందించే అవకాశం టాలీవుడ్ రాక్స్టార్ దేవీ శ్రీ ప్రసాద్కు వచ్చినట్లు తెలుస్తోంది. మామూలుగా ఈ సినిమాకు హిమేష్ రష్మియాను గానీ సాజిద్-వాజిద్ను గానీ తీసుకోవాలని సల్మాన్ అనుకుంటున్నారట. కానీ ప్రభుదేవా, దేవీ పేరును సూచించారట. అందుకు కండలవీరుడు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్.
కాగా ప్రభుదేవా-దేవీ శ్రీ మధ్య మంచి ర్యాపో ఉంది. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలకు దేవీశ్రీనే సంగీతం అందించారు. ఈ క్రమంలో ఇప్పుడు సల్లు భాయ్తో సినిమాకు రాక్స్టార్నే తీసుకోవాలని ఆయన సూచించారట. మరోవైపు సల్మాన్ కూడా గతంలో దేవీతో పనిచేశారు. డీఎస్పీ కంపోజ్ చేసిన ఆర్య 2లోని రింగ రింగ పాటను సల్మాన్ ఖాన్ రెడీ మూవీలో రీమిక్స్ చేయించుకున్నారు. అప్పుడు దేవీ పనితీరుకు మెచ్చిన సల్మాన్.. తన జయహో చిత్రం కోసం అతడిని పిలిపించుకొని మరీ ఓ మ్యూజిక్ బిట్ చేయించుకున్నారు. అందుకే ప్రభుదేవా ఛాయిస్కు సల్మాన్ ఓటేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన దేవీ.. త్వరలో తాను ఓ బాలీవుడ్ చిత్రాన్ని చేస్తున్నానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆ చిత్రం సల్మాన్ నటిస్తోన్న రాధే అని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో దేవీ శ్రీ.. ఉప్పెన, రంగ్దే, గుడ్లక్ సఖి, అల్లుడు అదుర్స్, అల్లు అర్జున్ 20వ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Read This Story Also: Coronavirus: కోలుకున్న భార్య.. సెల్ఫ్ ఐసోలేషన్లోనే ప్రధాని..!