రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్…కాదనలేకపోయిన పవన్
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ యమ బిజీగా ఉన్నారు. అధికార వైసీపీ నేతలపై, సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న విషయం ఇటీవల ‘దిల్ రాజు’ ఇచ్చిన స్టేట్మెంట్తో క్లియరైపోయింది. ‘పింక్’ రీమేక్తో తిరిగి తెరంగ్రేట్రం చేయబోతున్నాడు పవన్. అయితే ఈ మూవీకి పవన్ 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారన్న టాక్ ఫిలిం సర్కిల్లో జోరందుకుంటుంది. ఈ సినిమాకు గాను మొత్తం 70 కోట్ల బడ్జెట్ను […]
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ యమ బిజీగా ఉన్నారు. అధికార వైసీపీ నేతలపై, సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న విషయం ఇటీవల ‘దిల్ రాజు’ ఇచ్చిన స్టేట్మెంట్తో క్లియరైపోయింది. ‘పింక్’ రీమేక్తో తిరిగి తెరంగ్రేట్రం చేయబోతున్నాడు పవన్. అయితే ఈ మూవీకి పవన్ 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారన్న టాక్ ఫిలిం సర్కిల్లో జోరందుకుంటుంది.
ఈ సినిమాకు గాను మొత్తం 70 కోట్ల బడ్జెట్ను నిర్మాత దిల్ రాజు పక్కన పెట్టేశాడట. అందులో 50 కోట్లు పవన్ తీసుకుంటుండగా, మిగిలిన 20 కోట్లతో సినిమాని కంప్లీట్ చెయ్యనున్నారని టాక్. పవన్ సినిమా అంటే ఆ బజ్ మాములుగా ఉండదు. ఇక రీ ఎంట్రీ అంటే ఫ్యాన్స్కు పూనకాలే. ప్రజంట్ జరుగుతోన్న బిజినెస్ను బట్టి చూస్తే..యావరేజ్ టాక్ వచ్చినా పవన్ మూవీ ఈజీగా 100 కోట్లు వసూలు చేస్తుంది.
మూవీలో మెయిన్ లీడ్స్ కోసం నివేధా థామస్, అంజలి, అనన్య లను ఇప్పటికే కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో అమితాబ్ నటించిన ‘పింక్’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. తమిళ్లో అజిత్తో రీమేక్ చెయ్యగా..అక్కడ కూడా విజయదు:దుభి మోగించింది. మంచి మెసేజ్ ఉన్న మూవీ కావడంతో పవన్ కూడా ఈ రీమేక్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఓ మై ప్రెండ్’, ‘ఎమ్సీఏ’ చిత్రాలను డైరెక్ట్ చేసిన వేణు శ్రీరాం ఈ మూవీకి దర్శకుడు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ రీమేక్కు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.