హీరో వెంకటేష్ మీద వీరాభిమానం.. 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఫ్యాన్.. కానీ చివరకు

అభిమాన హీరోలను కలవాలని, వారిని చూడాలని కొంతమంది ఫ్యాన్స్ చాలా దూరుల నుంచి వస్తుంటారు. సెలబ్రెటీల మీద ఒక్కొక్కరు ఒక్కొక్కలా తమ అభిమానాన్ని చూపిస్తుంటారు.

హీరో వెంకటేష్ మీద వీరాభిమానం.. 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఫ్యాన్.. కానీ చివరకు
Follow us

|

Updated on: Feb 05, 2021 | 3:40 PM

Victory Venkatesh Fan : అభిమాన హీరోలను కలవాలని, వారిని చూడాలని కొంతమంది ఫ్యాన్స్ చాలా దూరుల నుంచి వస్తుంటారు. సెలబ్రెటీల మీద ఒక్కొక్కరు ఒక్కొక్కలా తమ అభిమానాన్ని చూపిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి తన ఫ్యావరెట్ హీరోను కలవడానికి ఏకంగా 140కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు. గతంలో అల్లు అర్జున్ అభిమాని 250 కి.మీ పాద‌యాత్ర చేసి బ‌న్నీని కలిసాడు, ఇటీవల వ‌రుణ్ తేజ్ అభిమాని 200 కి.మీ నుండి న‌డుచుకుంటూ వ‌చ్చి అభిమాన హీరోని క‌లిసాడు. తాజాగా విక్టరీ వెంకటేష్ కోసం వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లోని బుద్ధారాం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్య‌క్తి తన గ్రామం నుంచి  నడుచుకుంటూ..హైదరాబాద్ రామానాయుడు స్టూడియోకు చేరుకున్నాడు. దాదాపు 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ తన అభిమాన హీరోను చూద్దాం అనుకుంటే ఆ కోరిక నెరవేరలేదు . ప్రస్తుతం షూటింగ్స్ తో  వెంకటేష్ బిజీగా ఉండటంతో శ్రీనివాస్ ఆయనను కలవలేక పోయాడు. వెంకటేష్ నటించిన జయం మనదేరా..! సినిమా చూసిన దగ్గరనుంచి వెంకీ ఫ్యాన్స్ అయ్యానని ఆ సినిమాను 30సార్లకు పైగా చూశానని తెలిపాడు. గతంలోను వెంకటేష్ ను నాలుగు ఐదు సార్లు కలుద్దామనుకున్న కుదరలేదని చెప్పుకొచ్చాడు శ్రీనివాస్. వెంకటేష్ నుంచి పిలుపు వచ్చేంత వరకు ఎదురుచుస్తానని అంటున్నాడు ఈ వీరాభిమాని.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘Zombie Reddy’ Review : ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాంబి రెడ్డి’.. సినిమా ఎలా ఉందంటే..