AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పుష్ప’ కోసం రాజమండ్రి ఫిక్స్‌..!

అల్లు అర్జున్‌-సుకుమార్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీ షూటింగ్ అధిక భాగం అడవుల్లో జరగనుంది.

'పుష్ప' కోసం రాజమండ్రి ఫిక్స్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 12, 2020 | 1:44 PM

Share

Allu Arjun Pushpa: అల్లు అర్జున్‌-సుకుమార్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీ షూటింగ్ అధిక భాగం అడవుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో పుష్ప షూటింగ్ కోసం లాక్‌డౌన్ కంటే ముందు కేరళను ఎంచుకున్నారు దర్శకుడు సుకుమార్. కానీ కరోనా రావడంతో ఇప్పుడు పరిస్థితులు మారాయి. మొదట్లో కాస్త కట్టడిలో ఉన్నప్పటికీ., ఈ మధ్యన కేరళలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడకు వెళ్లడం కంటే ఇక్కడే షూటింగ్ చేసుకోవడం మేలని సుక్కు భావించారట.

దీంతో పుష్ప షూటింగ్‌ కోసం రాజమండ్రిని ఫిక్స్ చేశారట. త్వరలోనే అక్కడ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారట. ఇక చిత్రీకరణలో భాగంగా మొదట యాక్షన్ ఎపిసోడ్‌లను తెరకెక్కించనుండగా.. అందులో అల్లు అర్జున్, రష్మిక పాల్గొనబోతున్నారని సమాచారం. ఇక మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More:

పర్యావరణ రక్షణ కోసం బ్రిటన్‌ ప్రిన్స్ ముందడుగు.. ‘ఎర్త్‌షాట్‌’ ప్రైజ్‌ ఆవిష్కరణ

భారతీయ వైద్యుడి 110వ జయంతి వేడుకలు నిర్వహించిన చైనా