AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్‌ ముగియగానే శ్రుతీ చేసే పని అదేనట..!

తన తండ్రి కమల్ హాసన్‌ తనను ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదని శ్రుతీ హాసన్‌ పేర్కొంది. తాజాగా సోషల్ మీడియాలో శ్రుతీ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

లాక్‌డౌన్‌ ముగియగానే శ్రుతీ చేసే పని అదేనట..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 10, 2020 | 7:59 PM

Share

తన తండ్రి కమల్ హాసన్‌ తనను ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదని శ్రుతీ హాసన్‌ పేర్కొంది. తాజాగా సోషల్ మీడియాలో శ్రుతీ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అందులో ఓ నెటిజన్‌.. మీ తండ్రి మీకిచ్చిన వరెస్ట్ పనిష్మెంట్ ఏంటని అడగ్గా.. మా నాన్న ఇంతవరకు నన్ను తిట్టలేదు. కొట్టలేదు. ఆయన అలాంటి వారు కాదు. ఆయన ఎప్పుడూ లాజిక్‌గా ఉంటారు. అయితే ఓ సారి తప్పు చేసినప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యా అని మాత్రమే చెప్పారు అని కామెంట్ పెట్టారు.

ఇక లాక్‌డౌన్‌ తరువాత మీరు చేసే మొదటి పని ఏంటని అడిగిన ప్రశ్నకు.. నేను కచ్చితంగా షూటింగ్స్‌కు వెళతాను. షూటింగ్‌లను నేను చాలా మిస్ అవుతున్నా. అయితే అంతా సురక్షితంగా ఉన్నప్పుడే షూటింగ్‌లకు వెళతా అని పేర్కొంది. ఇక పవన్ కల్యాణ్‌ సరసన ఆమె నటించిన గబ్బర్‌ సింగ్ 8 సంవత్సరాలను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మాట్లాడిన శ్రుతీ.. ఆ సూపర్‌ హిట్ మూవీలో నేను భాగం అవ్వడం నా అదృష్టం. ఆ సినిమా నన్ను చాలా మార్చింది అని కామెంట్‌ పెట్టారు. కాగా శ్రుతీ  ప్రస్తుతం తెలుగులో పవన్ సరసన వకీల్ సాబ్, రవితేజ సరసన క్రాక్‌లో నటిస్తున్నారు.

Read This Story Also: ఆ మహమ్మారితో 13వేల పందులు మృతి చెందాయట..!