AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌కి రానున్న ‘రాధే శ్యామ్’‌ టీమ్‌..!

రెబల్‌ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం రాధే శ్యామ్‌. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న

హైదరాబాద్‌కి రానున్న 'రాధే శ్యామ్'‌ టీమ్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 31, 2020 | 2:09 PM

Share

Prabhas radhe Shyam: రెబల్‌ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం రాధే శ్యామ్‌. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. అయితే యూరప్ దేశాల్లో ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. అక్కడి దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యింది. దీంతో ఆయా దేశాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు పెడుతున్నారు. ఇక రాధే శ్యామ్‌ ఇటలీ షెడ్యూల్‌ ఈ వారానికి పూర్తి అవ్వబోతుందట. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ టీమ్‌ త్వరలోనే హైదరాబాద్‌కి రానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మిగిలిన షూటింగ్‌ని పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. (మహేష్‌, పూరీలను కలపబోతున్న ఆ నిర్మాత..!)

కాగా ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనుండగా.. పూజా ప్రేరణగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న రాధే శ్యామ్‌ని పలు భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. ( 15 నెలల బంగారం చోరీ కేసు: దొంగను పట్టించిన వాట్సాప్ స్టేటస్‌)