AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aakhri Sach OTT: ఆ 11 చావులకు కారణమెవరు? తమన్నా క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడుంటే?

ఈసారి చాలా డిఫరెంట్‌గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుంది.  ఆమె నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ ఆఖరి సచ్‌. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ రిలీజైంది. ఢిల్లీలోని ఒక కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పదంగా చనిపోతారు. 9 నుంచి 71 ఏళ్ల మధ్య ఉన్న మూడుతరాలకు చెందిన కుటుంబీకులు అంతా మూకుమ్మడిగా ఉరేసుకుంటారు. అయితే అవి ఆత్మహత్యలా? హత్యలా? లేకుంటే ఎవరైనా వారిని బలిదానాలకు ప్రేరేపించారా? అని తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా రంగంలోకి దిగుతుంది తమన్నా.

Aakhri Sach OTT: ఆ 11 చావులకు కారణమెవరు? తమన్నా క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడుంటే?
Aakhri Sach Web Series
Basha Shek
|

Updated on: Aug 12, 2023 | 6:30 AM

Share

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం బిజీబిజీగా ఉంటోంది. నెలకో సినిమా, వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ వారంలో తమన్నా నటించిన రెండు భారీ చిత్రాలు థియేటర్లో రిలీజయ్యాయి. రజనీకాంత్‌తో నటించిన జైలర్‌, మెగాస్టార్‌ చిరంజీవితో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న భోళాశంకర్‌ సినిమాలు రెండూ పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళుతున్నాయి. అంతకుముందు జీ కర్దా, లస్ట్ స్టోరీస్‌ వంటి వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించింది. ఇప్పుడు మరో సిరీస్‌తో మన ముందుకు రానుంది తమన్నా . అయితే ఈసారి చాలా డిఫరెంట్‌గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుంది.  ఆమె నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ ఆఖరి సచ్‌. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ రిలీజైంది. ఢిల్లీలోని ఒక కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పదంగా చనిపోతారు. 9 నుంచి 71 ఏళ్ల మధ్య ఉన్న మూడుతరాలకు చెందిన కుటుంబీకులు అంతా మూకుమ్మడిగా ఉరేసుకుంటారు. అయితే అవి ఆత్మహత్యలా? హత్యలా? లేకుంటే ఎవరైనా వారిని బలిదానాలకు ప్రేరేపించారా? అని తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా రంగంలోకి దిగుతుంది తమన్నా. విచారణంలో అంతులేని చిక్కులు, ప్రశ్నలు ఎదురవుతాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఆఖరి సచ్‌ సిరీస్‌ ఆగస్టు 25న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌.

2018లో దేశ రాజధాని ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పందంగా చనిపోయారు. ఇప్పుడు ఈ నిజజీవిత సంఘటన ఆదారంగానే ఆఖరి సచ్‌ వెబ్‌ సిరీస్‌ రూపొందించారని తెలుస్తోంది.  రాబీ గ్రేవెల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు సౌరవ్ దేవ్ కథను అందించారు. నిర్వికార్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ లో తమన్నాతో పాటు అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, దనిష్ ఇక్బాల్, నిషూ దీక్షిత్, క్రితి విజ్, సంజీవ్ చోప్రా కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

ఆఖరి సచ్ వెబ్ సిరీస్ ట్రైలర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు