AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhoomam OTT: తెలుగులో ఓటీటీలోకి ఫాహద్ ఫాజిల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ‘ధూమం’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ధూమం. పవన్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలో అపర్ణ బాలమురళి, రోషన్‌ మాథ్యూ, పార్వతి నాయర్‌, దేవ్‌ మోహన్‌ కీలక పాత్రల్లో నటించారు. కేజీఎఫ్, సలార్ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన హొంబాలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను రూపొందించింది.

Dhoomam OTT: తెలుగులో ఓటీటీలోకి  ఫాహద్ ఫాజిల్ సస్పెన్స్ థ్రిల్లర్.. 'ధూమం' స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Dhoomam Movie
Basha Shek
|

Updated on: Jul 07, 2024 | 6:30 AM

Share

మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ధూమం. పవన్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలో అపర్ణ బాలమురళి, రోషన్‌ మాథ్యూ, పార్వతి నాయర్‌, దేవ్‌ మోహన్‌ కీలక పాత్రల్లో నటించారు. కేజీఎఫ్, సలార్ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన హొంబాలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను రూపొందించింది. గతేడాది జూన్ లో రిలీజైన ధూమం మూవీ యావరేజ్ గా నిలిచింది. అంచనాలు అందుకోలేక మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. దీంతో ధూమం మూవీ కేవలం మలయాళం వరకే పరిమితమైంది. తెలుగులో రిలీజ్ చేయలేకపోయారు మేకర్స్.అయితే, ఇప్పుడు సుమారు ఏడాది తర్వాత ధూమం సినిమా తెలుగులో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ధూమం సినిమా రానుంది. జులై 11న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ఆహా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘ఎంతో గ్రిప్పింగ్‍గా ఉండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మిమ్మల్ని ఊహించని రైడ్‍లోకి తీసుకెళుతుంది. జూలై 11న ధూమం మూవీ ఆహాలో ప్రీమియర్ కానుంది’ అని ఆహా పోస్ట్ చేసింది. అలాగే సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

ధూమం సినిమాలో వినీత్, అనుమోహన్, అచ్యుత్ కుమార్, వినయ్ మీనన్, జోయ్ మాథ్యూ, నందు, భానుమతి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశవారు. పూర్ణచంద్ర తేజస్వి ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక ధూమం సినిమా కథ విషయానికి వస్తే.. ఓ సిగరెట్‌ కంపెనీలో అవినాష్‌ (ఫహద్‌ ఫాజిల్‌) సేల్స్‌మెన్‌గా పని చేస్తుంటాడు. ఓ అపరిచితుడి కారణంగా అతను అనుకోని ఇబ్బందుల్లో పడతాడు. అతడు చెప్పిందిచేయకపోతే అవినాష్‌ భార్య దియా (అపర్ణ బాలమురళి)ను చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరి ఆ అపరిచితుడు ఎవరు? అవినాష్‌తో ఏం పని చేయించాడు? అనేది తెలియాలంటే ధూమం సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.