పవన్ సినిమా కోసం ఆ యంగ్ హీరోను సంప్రదించలేదట..!
క్రిష్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రం విరూపాక్ష. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.
క్రిష్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రం విరూపాక్ష. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలనుకుంటోన్న క్రిష్ ఇందులో వివిధ భాషలకు చెందిన నటీనటీలను తీసుకుంటున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అందులో భాగంగా హీరోయిన్గా బాలీవుడ్ భామ జాక్వలిన్ను తీసుకున్నారని ఆ మధ్యన కామెంట్లు వినిపించాయి. ఇక ఈ మూవీలో విలన్ పాత్ర కోసం కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ను తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి.
అయితే మూవీ యూనిట్ సన్నిహితుల ప్రకారం ఈ మూవీ కోసం శివ కార్తికేయన్ సంప్రదించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో అన్ని ఇండస్ట్రీల్లో షూటింగ్లకు బ్రేక్ పడగా.. క్రిష్ ఎవరితో సంప్రదింపులు జరపలేదని తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్ తదుపరి షెడ్యూల్ మీద దృష్టి పెట్టాడని సమాచారం. కాగా లాక్డౌన్ పూర్తైన తరువాత మొదట వకీల్ సాబ్ను పూర్తి చేయనున్న పవన్.. ఆ తరువాత విరూపాక్షలో పాల్గొననున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Read This Story Also: ‘ఆచార్య’పై కొరటాల ఆసక్తికర వ్యాఖ్యలు.. చిరు మూవీ ఎలా ఉండబోతుందంటే..!