AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘ఆరుగురు పతివ్రతలు’ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా.? ఎలా ఉందంటే?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ హిట్ అండ్ ఫ్లాప్‌‌ల మధ్య ఊగిసులాడుతుంది. ఏ హీరోయిన్ ఎప్పుడు అవకాశాలు అందుకుని..

Tollywood: 'ఆరుగురు పతివ్రతలు' హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా.? ఎలా ఉందంటే?
Tollywood
Ravi Kiran
|

Updated on: Jan 10, 2023 | 6:19 PM

Share

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ హిట్ అండ్ ఫ్లాప్‌‌ల మధ్య ఊగిసులాడుతుంది. ఏ హీరోయిన్ ఎప్పుడు అవకాశాలు అందుకుని అగ్రస్థానం చేరుకుంటుందో.. ఏ హీరోయిన్ అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కొంతమంది అయితే ఒక్క సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుని ఫేడ్ అవుట్ అయిపోయారు. సరిగ్గా ఇదే కోవలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని.. ఇండస్ట్రీకి దూరమైన నటి అమృత.

మీకు ఆమెవరో గుర్తుండకపోవచ్చు..! కానీ ఆమె తెలుగులో నటించిన సినిమా పేరు చెబితే మాత్రం కచ్చితంగా గుర్తుపడతారు. స్వర్గీయ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 2004లో తెరకెక్కించిన చిత్రం ‘ఆరుగురు పతివ్రతలు’. ఈ మూవీలోని సన్నివేశాలు ఇప్పటికీ మీమర్స్‌కు పెద్ద ఫీస్ట్ మాత్రమే కాదు.. ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఈ చిత్రంలో అటు మొగుడు.. ఇటు లవర్ మధ్య నలిగిపోయిన మహిళ పాత్రలో కనిపించిన హీరోయిన్ మీకు గుర్తుండొచ్చు. ఆమె మరెవరో కాదు.. అమృత. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ హీరోయిన్ ఆ పాత్రలో నటించి మెప్పించింది.

అయితే అనూహ్యంగా ఈ చిత్రం తర్వాత ఆమె తెలుగు సినిమాలకు దూరమైంది. మొదటి సినిమాలో నటించిన పాత్ర తరహాలోనే ఆమెకు తదుపరి చిత్రాల్లోనూ రావడంతోనే ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారని తెలుస్తోంది. తెలుగు, కన్నడంతో పాటు ఇతర భాషల్లో కలిపి అమృత కేవలం 8 సినిమాల్లో మాత్రమే నటించారు. 2009లో ‘జోడి నెంబర్ 1’ అనే కన్నడ చిత్రం ఆమె నటించిన చివరి మూవీ. కాగా, వెండితెరకు దూరమైన అమృత.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం దాంపత్య జీవితంలో హ్యాపీగా ఉన్న అమృత బెంగుళూరులో గృహిణిగా స్థిరపడ్డారట.

Tollywood 1