Sai Pallavi: సూర్య కాంతి.. పెట్డాగ్.. మూణ్నెళ్ల తర్వాత సాయి పల్లవి పోస్ట్.. ఏమైపోయారంటూ ఫ్యాన్స్ ప్రశ్నలు
ఎట్టకేలకు మౌనం విడింది సాయిపల్లవి. సుమారు మూణ్నెళ్ల తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. సూర్యకాంతి పడేలా.. పెట్డాగ్తో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ 'హలో సన్ షైన్' అంటూ తన ఫాలోవర్లను పలకరించింది.
తన అందం, అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ పవర్స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. అయితే ఇటీవల ఈ న్యాచురల్ బ్యూటీ గురించి సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె సినిమాలకు వీడ్కోలు పలకనుందని, వైద్యురాలిగా స్థిరపడనుందని నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే గార్గి తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు సాయి పల్లవి. కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. ఇక సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్టులు పెట్టలేదు. దీంతో ఈ అమ్మడికేమైంది? అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. అయితే ఎట్టకేలకు మౌనం విడింది సాయిపల్లవి. సుమారు మూణ్నెళ్ల తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. సూర్యకాంతి పడేలా.. పెట్డాగ్తో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ ‘హలో సన్ షైన్’ అంటూ తన ఫాలోవర్లను పలకరించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది? ‘ఇన్ని రోజులు ఏమయ్యావ్?’ ‘నీ కొత్త సినిమా అప్డేట్స్ గురించి చెప్పు’ అంటూ ఫ్యాన్స్ రిక్వెస్టులు పెడుతున్నారు. కాగా 2022 అక్టోబరు 11 తర్వాత ఇన్స్టాగ్రామ్లో సాయిపల్లవి పెట్టిన పోస్ట్ ఇదే.
కాగా సినిమా రంగానికి వీడ్కోలు పలుకుతుందంటూ వస్తోన్న వార్తలపై స్పందించిన సాయిపల్లవి ‘అందం అన్నది రూపంలో కాదని గుణంలో ఉందని చెప్పే ప్రేమమ్ చిత్రంతో నా సినీప్రయాణం ప్రారంభమైంది. ఆ చిత్రం అంత పెద్ద విజయం సాధిస్తుందని అసలు ఊహించలేదు. ఆ చిత్రంలో టీచర్ ఇమేజ్ను మార్చడానికి వేరే తరహా పాత్రల్లో నటించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. మంచి కథలు లభిస్తే భాషాభేదం లేకుండా నటించడానికి సిద్ధం’ అని చెప్పుకొచ్చింది. తద్వారా తనపై వస్తోన్న పుకార్లకు చెక్ పెట్టింది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.