AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు సరసన ఐష్..?ఈసారైనా క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందా..!

తన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలో కొరటాలతో సెట్స్‌ మీదకు వెళ్లనున్నాడు. చిరు కోసం కొరటాల పవర్‌ఫుల్ కథను సిద్ధం చేయగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఈ మూవీ కోసం నటులను ఎంపిక చేసే పనిలో కొరటాల ఉండగా.. హీరోయిన్‌ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం తమన్నా, అనుష్క, నయనతార, […]

చిరు సరసన ఐష్..?ఈసారైనా క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 12, 2019 | 10:09 AM

Share

తన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలో కొరటాలతో సెట్స్‌ మీదకు వెళ్లనున్నాడు. చిరు కోసం కొరటాల పవర్‌ఫుల్ కథను సిద్ధం చేయగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఈ మూవీ కోసం నటులను ఎంపిక చేసే పనిలో కొరటాల ఉండగా.. హీరోయిన్‌ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం తమన్నా, అనుష్క, నయనతార, శృతీహాసన్ ఇలా పలువురి పేర్లు వినిపించగా.. తాజాగా ఐశ్వర్య పేరు లిస్ట్‌లో చేరింది. ఈ మేరకు ఐష్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

అయితే చిరు, ఐశ్వర్యరాయ్ కాంబినేషన్‌లో మూవీని తెరకెక్కించేందుకు గతంలో పలువురు దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంతవరకు ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేకపోయింది. ఇప్పుడైనా ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి. ఇక ఈ చిత్రంలో చిరు డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఉగాదికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ‘సైరా’ షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటించగా.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, బ్రహ్మాజీ, రోహిణి, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ నిర్మించిన ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం అందించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సైరాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.