AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగాస్టార్‌పై ఫ్యాన్స్‌ అసంతృప్తి.. ఎందుకంటే..!

లాక్‌డౌన్‌ సమయంలో మెగాస్టార్ చిరంజీవి చాలా యాక్టివ్‌ అయ్యారు. ఓ వైపు సీసీసీ(కరోనా క్రైసిస్ ఛారిటీ) పనులు చూసుకుంటూ, మరోవైపు కుటుంబసభ్యులతో గడుపుతూ..

మెగాస్టార్‌పై ఫ్యాన్స్‌ అసంతృప్తి.. ఎందుకంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2020 | 11:03 AM

Share

లాక్‌డౌన్‌ సమయంలో మెగాస్టార్ చిరంజీవి చాలా యాక్టివ్‌ అయ్యారు. ఓ వైపు సీసీసీ(కరోనా క్రైసిస్ ఛారిటీ) పనులు చూసుకుంటూ, మరోవైపు కుటుంబసభ్యులతో గడుపుతూ.. అప్పుడప్పుడు పలు ఛానెళ్లకు ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూల్లో చిరు చాలా విషయాలే పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తన తదుపరి సినిమాల గురించి ఇటీవల మెగాస్టార్ క్లారిటీ ఇచ్చేశారు. ఏ యంగ్ హీరో కూడా లైన్‌లో పెట్టనంతమంది దర్శకులను ఆయన క్యూలో పెట్టుకున్నారు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తోన్న చిరు.. ఆ తరువాత లూసిఫర్ రీమేక్‌లో నటించనున్నానని, దానికి సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తారని తెలిపారు. ఇక ఈ మూవీల తరువాత బాబీ, మెహర్ రమేష్‌లు తనకు కథలు చెప్పారని వివరించారు. అంతేకాదు సుకుమార్, త్రివిక్రమ్, హరీష్‌ శంకర్‌, పరశురామ్ తదితరులు కూడా తనతో పనిచేసేందుకు ఆసక్తిని చూపుతున్నారని చిరంజీవి స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటన తరువాత మెగా ఫ్యాన్స్‌ కాస్త అసంతృప్తిని చెందుతున్నారు. ముఖ్యంగా ఆ లిస్ట్‌లోని ఒక దర్శకుడు అస్సలు ఫామ్‌లో లేరని.. ఆ దర్శకుడు వద్దని మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ప్రకటించిన ప్రాజెక్ట్‌లన్నీ సెట్స్‌ మీదకు వెళ్లవు. దీంతో ఈ సినిమాన్నీ సెట్స్ మీదకు వెళ్లినప్పుడు కదా అంటూ కొంతమంది మెగా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరి చిరంజీవి ఇప్పుడు ప్రకటించిన దర్శకుల్లో .. ఎప్పుడు ఎవరితో సెట్స్ మీదకు వెళతారు..? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us