AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddarth Malhotra – Kiara Advani: ఒక్కటైన లవ్‏బర్డ్స్.. సిద్ధార్థ్, కియారా వివాహ మహోత్సవం.. అంగరంగ వైభవంగా..

ఎట్టకేలకు ఫిబ్రవరి 7న ఈ ప్రేమపక్షులు ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. అయితే వీరి పెళ్లికి వచ్చే అతిథులకు ఫోన్ ఉపయోగించేందుకు అనుమతి లేదని సమాచారం.

Siddarth Malhotra - Kiara Advani: ఒక్కటైన లవ్‏బర్డ్స్.. సిద్ధార్థ్, కియారా వివాహ మహోత్సవం.. అంగరంగ వైభవంగా..
Siddarth Kiara
Rajitha Chanti
|

Updated on: Feb 07, 2023 | 9:01 PM

Share

బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్ర, హీరోయిన్ కియారా అద్వానీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు.. అతికొద్ది మంది సన్నిహితులు.. సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. షేర్షా సినిమాతో తెరపై మాయ చేసిన ఈ బ్యూటీఫుల్ జోడీ.. ఇప్పుడు నిజజీవితంలో దంపతులుగా మారారు. వీరి పెళ్లికి రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్ వేదిక అయ్యింది. గత మూడు నాలుగు రోజులుగా వీరి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. వీరి వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు హజరయ్యారు. అంతేకాదు.. అతిథులను రిసీవ్ చేసుకోవడం కోసం ఏకంగా 70 లగ్జరీ కార్లను నిర్వహాకులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా..  సిద్ధార్థ్, కియారా పెళ్లికి రోజుకు దాదాపు రూ. 2 కోట్లు ఖర్చయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఖరీదైన పెళ్లి వేడుకలలో వీరిది ఒకటి. ఎట్టకేలకు ఫిబ్రవరి 7న ఈ ప్రేమపక్షులు ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. అయితే వీరి పెళ్లికి వచ్చే అతిథులకు ఫోన్ ఉపయోగించేందుకు అనుమతి లేదని సమాచారం.

షేర్షా సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరు పలుమార్లు కలుసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక గత కొద్ది రోజులుగా వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ వైరలయ్యాయి. అయితే వీరిద్దరితోపాటు.. సినీ ప్రముఖులు ఎవరూ కూడా ఈ జంట పెళ్లి గురించి స్పంధించకపోవడం కూడా గమనార్హం. అయితే అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లిలో వంటలు చేయడానికి ముంబయి, ఢిల్లీ నుంచి దాదాపు 500 మంది వెయిటర్లను.. వంట చేసేవారిని రప్పించారట. ఈరోజు రాత్రి జరగనున్న బరాత్ కార్యక్రమంలో కియారా.. సిద్ధార్థ్ వివాహ వేడుకలు ముగియబోతున్నాయి. వీరి పెళ్లి వేదికకు సంబంధించిన ఫోటోస్.. వీడియోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కియారా అద్వానీ తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆర్సీ 15 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈసినిమాను తెలుగుతోపాటు… మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో కియారాతోపాటు.. శ్రీకాంత్, అంజలి కీలకపాత్రలలో నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి