Akshay Kumar : ఆర్మీ డే సందర్భంగా సైనికులతో గడిపిన స్టార్ హీరో.. జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడిన అక్షయ్
ఏడాదికి నాలుగు ఐదు సినిమాలు చేసే ఏకైక హీరో అక్షయ్ కుమార్. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
Akshay Kumar : ఏడాదికి నాలుగు ఐదు సినిమాలు చేసే ఏకైక హీరో అక్షయ్ కుమార్. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అంతే కాదు సేవాకార్యక్రమాల్లోనూ అక్షయ్ ముందుంటాడు. కరోనా సమయంలో పీఎం సహాయనిధికి భారీగా విరాళం ఇచ్చి మంచిమనసు చాటుకున్నాడు అక్షయ్. తాజాగా ఈ స్టార్ హీరో.. ఇవాళ ఆర్మీ డే సందర్భంగా జవాన్లతో గడిపారు అక్షయ్. ఆర్మీ డేను పురస్కరించుకుని మారథాన్ ను ప్రారంభించాడు.
అలాగే ఉదయాన్నే జవాన్లతో కలిసి వాలీబాల్ గేమ్ ఆడాడు. అక్షయ్కుమార్ జవాన్లు వేసుకున్నట్టుగానే బ్లాక్ డ్రెస్ వేసుకుని జవాన్లతో వాలీబాల్ ఆడిన వీడియోను షోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అక్షయ్ ‘బచ్చన్ పాండే’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్ లో జరుగుతుంది. ధైర్యవంతులైన జవాన్లను కలవడం, ఆర్మీ డే సందర్భంగా మారథాన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. వాలీబాల్ గేమ్ కంటే ఉత్తమమైన వామ్ అప్ ఏముండదు. అంటూ రాసుకొచ్చారు అక్షయ్. హీరోయిన్ కృతిసనన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Ponniyin Selvan : ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా వెబ్ సిరీస్.. సంగీతం అందించనున్న ఇళయరాజా..