Ponniyin Selvan: ఓటీటీ హక్కులకే కోట్ల రూపాయలా.? సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న పొన్నియిన్ సెల్వన్ మూవీ..
Ponniyin Selvan: ఓటీటీ మార్కెట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏకంగా థియేటర్ మార్కెట్కు పోటీనిచ్చే స్థాయికి ఓటీటీ దూసుకుపోతోంది. ఓటీటీ సంస్థల మధ్య పెరుగుతోన్న పోటీ, ప్రేక్షకుల నుంచి పెరుగుతోన్న ఆదరణ, వెరసి..
Ponniyin Selvan: ఓటీటీ మార్కెట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏకంగా థియేటర్ మార్కెట్కు పోటీనిచ్చే స్థాయికి ఓటీటీ దూసుకుపోతోంది. ఓటీటీ సంస్థల మధ్య పెరుగుతోన్న పోటీ, ప్రేక్షకుల నుంచి పెరుగుతోన్న ఆదరణ, వెరసి.. ఓటీటీకి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారీగా డిమాండ్ ఉన్న చిత్రాల హక్కుల కోసం ఓటీటీ సంస్థలు ఎంత పెట్టడానికైనా వెనకాడడం లేదు. తాజాగా మణిరత్నంలో దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఓటీటీలో సరికొత్త రికార్డుకు శ్రీకారం చుట్టింది.
విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష.. ఇలా ఎంతో మంది టాప్ నటీనటులు నటిస్తోన్న పొన్నియిన్ సెల్వన్ను అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రెండు పార్ట్లుగా విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్పార్ట్ను సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా క్రేజ్ను ఓటీటీ సంస్థ క్యాచ్ చేసుకునే పనిలో పడినట్లు సమాచారం.
పొన్నియిన్ సెల్వన్ రెండు పార్ట్ల ఓటీటీ స్ట్రీమింగ్ను అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ. 125 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా సన్టీవీ డిజిటల్ రైట్స్ను దక్కించుకుంది. ఇప్పుడీ ఈ వార్త ట్రెండింగ్గా మారింది. ఒక సినిమా ఓటీటీ హక్కులతోనే ఇన్ని కోట్లు సంపాదించడం నిజంగా ఓ అద్భుతం అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఇన్ని అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..