సుశాంత్ కేసులో ఆ ఐదుగురుపై నిఘా పెట్టిన సీబీఐ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం కేసు విచారణలో దూకుడు పెంచింది సీబీఐ. ఈ క్రమంలో ఐదుగురు ముఖ్య‌మైన‌ సాక్షులను గుర్తించింది.

సుశాంత్ కేసులో ఆ ఐదుగురుపై నిఘా పెట్టిన సీబీఐ
Follow us

|

Updated on: Aug 12, 2020 | 8:39 AM

Sushant Singh Rajput death case :బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం కేసు విచారణలో దూకుడు పెంచింది సీబీఐ. ఈ క్రమంలో ఐదుగురు ముఖ్య‌మైన‌ సాక్షులను గుర్తించింది. ఇందులో సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి, ఫ్లాట్​లోనే ఉండే అత‌ని ఫ్రెండ్‌ సిద్ధార్థ్ పితాని, సుశాంత్ సోదరి మీతూ సింగ్, ఫ్లాట్ మేనేజర్ శామ్యూల్ మిరండాతో పాటు మరో వ్యక్తిపై నిఘా పెంచింది. వీరందరూ సుశాంత్​ మ‌ర‌ణించిన‌ రోజు అక్కడే ఉన్నారు. పోలీసుల కంటే ముందుగానే వీరు ఘటనా స్థలంలో తార‌స‌ప‌డ్డారు. అలాగే పోలీసులు స్పాట్‌కు చేరుకోక‌ముందు డెడ్‌బాడీని ఎందుకు కిందకు దించారనే విషయంపై స్ప‌ష్ట‌త‌ కోసం వీరి నుంచి సమాచారం సేకరించే పనిలో పడింది సీబీఐ.

ఈ కేసు విషయంలో మొత్తం 56 మందికి సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రజంట్ ఈ కేసును అత్యున్న‌త న్యాయ‌స్థానం విచారిస్తోంది. తన కుమారుడి మ‌ర‌ణం విష‌యంలో న్యాయం జరగాలని కేకే సింగ్​ బిహార్ రాజధాని పాట్నా పీఎస్‌లో ఫిర్యాదు చేవారు. రియా చక్రవర్తి పాత్ర‌పై ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. దీనిపై ముంబై పోలీసుల నుంచి సమాచారం సేకరించారు పాట్నా పోలీసులు. అలాగే ఈ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం కేసును సమర్థవంతంగా నిర్వహించేందుకు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని గ‌తంలో కేంద్రాన్ని కోరారు. అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ కేంద్రం ఆగస్టు 6న ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అలాగే రియా చక్రవర్తి ఫ్యామిలీ, సుశాంత్ మేనేజర్ శ్రుతి మోదీ, అతడి ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానిపై ఈడీ విచారణ కొనసాగుతోంది. మనీ ల్యాండరింగ్ విషయమై వీరిని ప్రశ్నిస్తోంది ఈడీ.

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?