“12 శాతం వడ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గవర్నమెంట్ జీవోలు రద్దు”
గవర్నమెంట్ ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ నెలల జీతాల్లో 50 శాతం వాయిదా వేయడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది.
AP High Court : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నమెంట్ ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ నెలల జీతాల్లో 50 శాతం వాయిదా వేయడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. రిటైర్డ్ ఉద్యోగులకు సగం పెన్షన్ చెల్లించకపోవడం కూడా కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. లాక్డౌన్ సమయంలో జీతాలు, పెన్షన్లు సగమే చెల్లించేలా గవర్నమెంట్ జారీ చేసిన జీవో 26, 37లను రద్దు చేసింది.
వాయిదా వేసిన 50శాతం శాలరీస్, పెన్షన్లను ఏడాదికి 12శాతం చొప్పున వడ్డీతో 2 నెలల్లోగా చెల్లించాలని గవర్నమెంట్ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో గరిష్ఠంగా 60శాతం, కనిష్ఠంగా 10శాతం చెల్లింపులను వాయిదా వేస్తూ గవర్నమెంట్ గతంలో జీవోలు విడుదల చేసింది. ఇది చట్టవిరుద్ధమంటూ రిటైర్డు జిల్లా జడ్జి లక్ష్మీ కామేశ్వరి దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ చేపట్టింది. 2 నెలల్లో వడ్డీతో సహా శాలరీస్ చెల్లించాలని ఆదేశించింది.
Also Read : ఆ ప్రాజెక్టు కొత్తది కాదు..కేంద్ర మంత్రికి లేఖ రాసిన సీఎం జగన్