AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Elections 2022: నేటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జన్ విశ్వాస్ యాత్రలు.. ఎందుకోసమంటే?

BJP Jan Vishwas Yatra నేటి నుంచి యూపీలో భారతీయ జనతా పార్టీ జన్ విశ్వాస్ యాత్రలను ప్రారంభించనుంది. 'జన్ విశ్వాస్ యాత్ర' పేరుతో ఆదివారం నుంచి రాష్ట్రంలో బీజేపీ ఆరు యాత్రలు ప్రారంభిస్తోంది.

UP Elections 2022: నేటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జన్ విశ్వాస్ యాత్రలు.. ఎందుకోసమంటే?
Jan Vishwas Yatra
Balaraju Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 23, 2021 | 6:13 PM

Share

UP Assembly Elections 2022: వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అప్పుడే ప్రచారం షురూ చేసింది. నేటి నుండి UPలో జన్ విశ్వాస్ యాత్రను ప్రారంభించాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు నడ్డాతో కలిసి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రారంభిస్తారు.

నేటి నుంచి యూపీలో భారతీయ జనతా పార్టీ జన్ విశ్వాస్ యాత్రలను ప్రారంభించనుంది. ‘జన్ విశ్వాస్ యాత్ర’ పేరుతో ఆదివారం నుంచి రాష్ట్రంలో బీజేపీ ఆరు యాత్రలు ప్రారంభిస్తోంది. బిజ్నోర్, మథుర, ఝాన్సీ, ఘాజీపూర్, అంబేద్కర్ నగర్, తదితర ప్రాంతాల నుంచి యాత్రలు ప్రారంభమవుతాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ శనివారం తెలిపారు. డా. రామ్ మనోహర్ లోహియా జన్మస్థలమైన లోహియా అంబేద్కర్ నగర్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా యాత్రను ప్రారంభిస్తారు. ఆయన వెంట కేంద్ర మంత్రి, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర, కేంద్ర సహాయ మంత్రి కౌశల్ కిషోర్ కూడా పాల్గొంటారు. ఈ ప్రయాణం అంబేద్కర్ నగర్, అయోధ్య, గోండా, బల్రాంపూర్, శ్రావస్తి, బహ్రైచ్, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్ బరేలీ మీదుగా బారాబంకి తర్వాత లక్నోలోని కకోరి వద్ద ముగుస్తుంది.

వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ.. ప్రజల మద్దతు కూడగట్టేందుకు మరోసారి ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు స్వతంత్ర దేవ్ సింగ్ మాట్లాడుతూ.. ‘బీజేపీ రాష్ట్రంలో ఆదివారం నుంచి ఆరు యాత్రలను ప్రారంభించబోతోంది. జన్ విశ్వాస్ యాత్ర’ ఇవి బిజ్నోర్, మధుర, ఝాన్సీ, ఘాజీపూర్, అంబేద్కర్ నగర్ మరియు బల్లియా నుండి ప్రారంభమవుతాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘నా గుండారాజ్, నా అవినీతి-అబ్కీ బార్ బీజేపీ సర్కార్’ అంటూ యాత్రలు చేసి, ప్రజల మన్ననలు పొందితేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ గూండారాజ్‌, అవినీతిని ప్రజలు తిరస్కరించారని.. నేడు గూండారాజ్‌ లేదని, అవినీతి లేదని, నేడు గూండాలంతా భయపడుతున్నారని, ఇప్పుడు సంస్థ, ప్రభుత్వం తమ విజయాలతో ప్రజల్లోకి వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈసారి కూడా పార్టీకి ప్రజల ఆశీస్సులు లభిస్తాయని, 2022లో మళ్లీ సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడుతుందని సింగ్ అన్నారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మధురధామ్‌ నుంచి రెండో యాత్ర ప్రారంభిస్తారు. కేంద్ర మాజీ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌, ఎంపీ రాజ్‌వీర్‌ సింగ్‌తో కలిసి యాత్ర కొనసాగనుంది. మధుర నుంచి అలీఘర్, ఎటా, మెయిన్‌పురి, ఆగ్రా, హత్రాస్, ఫిరోజాబాద్, కస్గంజ్, బదౌన్, షాజహాన్‌పూర్, పిలిభిత్ మీదుగా ఈ యాత్ర బరేలీలో ముగుస్తుంది.

మూడో యాత్ర రాణి లక్ష్మీబాయి నగరం ఝాన్సీ నుంచి ప్రారంభమవుతుందని స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు. దీనిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ దినేష్‌ శర్మ ప్రారంభిస్తారని, కేంద్ర రాష్ట్ర మంత్రులు బీఎల్‌ వర్మ, నిరంజన్‌ జ్యోతి ఈ యాత్రలో పాల్గొంటారని సింగ్‌ తెలిపారు. ఈ ప్రయాణం ఝాన్సీ నుండి ప్రారంభమై లలిత్‌పూర్, మహోబా, చిత్రకూట్, ఫతేపూర్, హమీర్‌పూర్, జలౌన్, ఔరైయా, కాన్పూర్ దేహత్, ఫరూఖాబాద్ మీదుగా కాన్పూర్‌లో ముగుస్తుంది.

నాల్గవ యాత్ర బిజ్నోర్‌లోని బిదుర్ కుటి నుండి ప్రారంభమవుతుంది. మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్‌లతో కలిసి యాత్రను ప్రారంభిస్తారు. బిజ్నోర్ నుండి ముజఫర్‌నగర్, సహరాన్‌పూర్, బాగ్‌పట్, షామ్లీ, ఘజియాబాద్, గౌతమ్ బుద్ నగర్, బులంద్‌షహర్, హాపూర్, అమ్రోహా, మొరాదాబాద్, సంభాల్ మీదుగా ఈ ప్రయాణం రాంపూర్‌లో ముగుస్తుంది.

ఐదవ యాత్ర వివరాలను తెలియజేస్తూ, ఐదవ యాత్ర బల్లియా నుండి ప్రారంభమవుతుందని, దీనిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా స్వతంత్ర దేవ్ సింగ్, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్‌లతో కలిసి ప్రారంభిస్తారని రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. బల్లియా నుంచి మౌ, అజంగఢ్, డియోరియా, కుషీనగర్, మహరాజ్‌గంజ్, సిద్ధార్థనగర్, సంత్ కబీర్ నగర్, బస్తీ వరకు ప్రయాణం సాగుతుంది.

ఆరో యాత్ర ఘాజీపూర్ నుంచి ప్రారంభమవుతుందని, ఈ యాత్రలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య, న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ హాజరవుతారని తెలిపారు. ఘాజీపూర్ నుండి చందౌలీ వరకు సోన్‌భద్ర, మీర్జాపూర్, ప్రయాగ్‌రాజ్, కౌశాంబి, భదోహి, వారణాసి, జౌన్‌పూర్, సుల్తాన్‌పూర్ మీదుగా అమేథీలో ముగుస్తుంది.

Read Also….  CJI NV Ramana: వరంగల్‌ జిల్లాలో సీజేఐ పర్యటన.. భద్రకాళీ ఆలయంలో ఎన్వీ రమణ దంపతుల పూజలు