Telangana: టీచర్ నిర్వాకానికి స్పర్శ కోల్పోయిన విద్యార్థిని.. ఐదు రోజులు కంటిన్యూగా నిలబెట్టి.. కారణమేంటంటే

విద్యార్థులు (Students) హోం వర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఇవ్వడం మామూలే. అయితే అవి బోధనకు సంబంధించినవే ఉండాలని, స్టూడెంట్స్ ను కొట్టడం, తిట్టడం, వేధించడం వంటివి చేయవద్దని ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది. స్టూడెంట్స్ కు ఇచ్చే...

Telangana: టీచర్ నిర్వాకానికి స్పర్శ కోల్పోయిన విద్యార్థిని.. ఐదు రోజులు కంటిన్యూగా నిలబెట్టి.. కారణమేంటంటే
Girl Punishment
Follow us

|

Updated on: Aug 29, 2022 | 10:31 AM

విద్యార్థులు (Students) హోం వర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఇవ్వడం మామూలే. అయితే అవి బోధనకు సంబంధించినవే ఉండాలని, స్టూడెంట్స్ ను కొట్టడం, తిట్టడం, వేధించడం వంటివి చేయవద్దని ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది. స్టూడెంట్స్ కు ఇచ్చే పనిష్మెంట్స్ వారి అభివృద్ధికి తోడ్పాలే గానీ వారికి ఇబ్బంది కలిగించవద్దు. అయినా కొందరు ఉపాధ్యాయుల్లో మార్పు రావడం లేదు. తెలిసే తెలియకో విద్యార్థులు తప్పు చేస్తే వారి తప్పును సరిదిద్దకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. క్రమశిక్షణ పేరుతో తీవ్రంగా స్పందిస్తున్నారు. కొట్టడం, ఎండలో నిల్చోబెట్టడం వంటివి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇవి చట్టప్రకారం అంగీకరించదగినవి కావు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ముందస్తు అనుమతి లేకుండా కాలేజ్ కు లీవ్ పెట్టిందని ఓ విద్యార్థిని పట్ల లెక్చరర్ దారుణంగా ప్రవర్తించింది. క్రమశిక్షణ తప్పిందంటూ భారీ పనిష్మెంట్ ఇచ్చింది. అందేంటంటే.. ఉదయం కాలేజ్ ప్రారంభం అయినప్పటి నుంచి సాయంత్రం ముగిసేంత వరకు నిల్చోబెట్టింది. ఇలా వరసగా ఐదు రోజులు చేయడంతో చివరకు ఆమె కాళ్ల స్పర్శను కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని పెద్దపల్లి (Peddapalli) జిల్లా సుల్తానాబాద్ కు చెందిన ఓ విద్యార్థిని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ లో చదువుకుంటోంది.

ఈ నెల 18న ఆమెకు అనారోగ్యంగా ఉందని ఒక రోజు సెలవు పెట్టింది. ఒక రోజుకు మాత్రమే పర్మిషన్ తీసుకున్న విద్యార్థి ఈ నెల 23న కళాశాలకు వెళ్లింది. దీంతో మహిళ లెక్చరర్ మహేశ్వరికి కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కరోజుకు మాత్రమే అనుమతి తీసుకుని ఇన్ని రోజులు కాలేజ్ కి ఎందుకు రాలేదని నిలదీసింది. అంతటితో ఆగకుండా విద్యార్థినిని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరసగా అయిదు రోజులపాటు నిలబెట్టింది. దీంతో ఆమె కాళ్లలో స్పర్శ కోల్పోయింది. చివరకు నడవలేని స్థితికి చేరుకుంది. ఆమె పరిస్థితిని గమనించిన తోటి విద్యార్థులు బాధితురాలికి చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఎమ్మారై స్కానింగ్‌ కోసం సిరిసిల్లలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారడంతో జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి స్పందించారు. ఘటనకు కారుకురాలైన లెక్చరర్ మహేశ్వరిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రిన్సిపల్‌ ను ట్రాన్స్ ఫర్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..