విషాదం.. ఇంట్లో గ్యాస్ లీక్ చేసుకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య..!
తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. భద్రాది కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఇంట్లో గ్యాస్ లీక్ చేసుకుని..
తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. భద్రాది కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఇంట్లో గ్యాస్ లీక్ చేసుకుని ఆ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోంది. ఈ ఘటనలో మరో బాలికకు తీవ్ర గాయాలు కావటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పాల్వంచకు చెందిన మండిగ నాగ రామకృష్ణ నవభారత్లో మీసేవా సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఇటీవల డాడీస్ రోడ్ అనే యాప్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. అయితే కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు స్థానికులు తెలిపారు.
సోమవారం ఉదయం 3 గంటల సమయంలో పాత పాల్వంచలోని జెండాల బజార్ లోని తన నివాసంలో పెద్ద శబ్దం రావటంతో స్థానికులు వచ్చి చూడగా మండిగ నాగ రామకృష్ణ, శ్రీలక్ష్మి (భార్య), సాహిత్య (కుమార్తె) మృతి చెందారు. మరో కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఇవి కూడా చదవండి: