AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విజయవాడలో దారుణం.. వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

Andhra Pradesh: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. బీఆర్టీఎస్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతి వేగంగా ప్రయాణికులతో వెళ్తున్న ఆటోని,

Andhra Pradesh: విజయవాడలో దారుణం.. వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..
Accident
Shiva Prajapati
|

Updated on: Sep 28, 2021 | 8:25 AM

Share

Andhra Pradesh: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. బీఆర్టీఎస్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతి వేగంగా ప్రయాణికులతో వెళ్తున్న ఆటోని, కారుని మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని మధురానగర్‌ కూడిలి బీఆర్టీఎస్ రోడ్డుపై కారు బీభత్సం సష్టించింది. మద్యం మత్తులో కారును నడిపిన డ్రైవర్.. అతి వేగంతో ప్రయాణించి ముందుగా ప్రయాణికులతో వెళ్తున్న ఆటోని ఢీకొట్టాడు. ఆ తరువాత కాసేపటికే మరో కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులతో పాటు.. ఆటో డ్రైవర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

మరో ధ్వంసమైంది. కాగా, ప్రమాదానికి కారణమైన వ్యక్తి తన కారుని వదిలి పరాయ్యేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పట్టుకున్నారు. తొలుత దేహశుద్ధి చేశారు. అనంతరం సత్యనారాయణపురం పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసిన పోలీసులు.. డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Crime News: జాతీయ రహదారిపై కంటైనర్‌ను ఢీ కొట్టిన బస్సు.. 9 మందికి తీవ్రగాయాలు..

MI vs PBKS, LIVE Streaming: దమ్మున్న ఆటగాళ్లు.. ధీటైన పోటీ.. ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది.. ఎలా చూడాలి..

Samantha: సమంతపై బాలీవుడ్ హీరో పొగడ్తలు.. ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు.. కారణమెంటంటే..