Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి ఎస్బీఐ నుంచి లోన్ తీసుకున్న ఘనులు.. కేసు నమోదు చేసిన పోలీసులు!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి మూడేళ్ల క్రితం నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 17.8 లక్షల రూపాయల విలువైన బంగారు రుణం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు వ్యక్తులపై హోస్కోట్ పోలీసులు మోసం కేసు నమోదు చేశారు.

Gold Loan: నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి ఎస్బీఐ నుంచి లోన్ తీసుకున్న ఘనులు.. కేసు నమోదు చేసిన పోలీసులు!
Gold Loan On Fake Gold
Follow us
KVD Varma

|

Updated on: May 04, 2021 | 11:15 AM

Gold Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి మూడేళ్ల క్రితం నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 17.8 లక్షల రూపాయల విలువైన బంగారు రుణం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు వ్యక్తులపై హోస్కోట్ పోలీసులు మోసం కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 29 న ఎస్బీఐ హోస్కోట్ శాఖకు చెందిన మాలతి ఎస్. నిందితులు రుణాన్ని ఎగవేసినట్లు గుర్తించారు. ఈ లోన్ రికవరీ ప్రక్రియను ప్రారంభించినప్పుడు ఈ మోసం వెలుగులోకి వచ్చింది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడం లేదని గురించి..వారికి విషయం గుర్తుచేసేందుకు తాను నిందితులకు నోటీసు పంపించినట్లు ఆమె చెప్పారు. ఆ నోటీసులకు స్పందన లేకపోవడంతో వేలం వేయడానికి సిద్ధం కావడానికి బంగారాన్ని మూల్యాంకనం కోసం పంపించానని మాలతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బంగారాన్ని మూల్యాంకనం కోసం పంపించినపుడు బంగారం నకిలీది అని తేలడంతో షాక్ తిన్నానని ఆమె పోలీసులకు తెలిపారు.

ఈ కేసులో నాగరాజాగా గుర్తించబడిన నిందితుడు 6.68 లక్షల రుణం పొందడానికి 346 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టాడు. నటరాజ హెచ్.ఎస్. 237 గ్రాముల బంగారాన్ని కుదువ పెట్టి 4.49 లక్షల రుణం పొందారు; 244 గ్రాముల బంగారంతో మంజునాథకు 7 4.7 లక్షలు లభించాయి; హనుమంత పవార్ 79 గ్రాముల బంగారంపై 1.5 లక్షల రుణం తీసుకున్నాడు. మూర్తి కె.ఎన్. 80 గ్రాముల బంగారానికి వ్యతిరేకంగా 1.7 లక్షల రుణం పొందారు. అలాగే, బాబాజన్ 24 గ్రాముల బంగారాన్ని 2018 మార్చిలో 46,000కు తాకట్టు పెట్టాడు.

బంగారం రుణాలను ధ్రువీకరించి, రుణాలను మంజూరు చేసిన బ్యాంక్ ఉద్యోగుల జాబితాను కూడా మాలతి పోలీసులకు అందచేశారు. ఈ మోసంలో అధికారుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు అధికారులు రుణం మంజూరు చేసేటప్పుడు తగిన విధానాన్ని అనుసరించలేదని వారు చెప్పారు. నిందితులను అరెస్టు చేసిన తర్వాతే బ్యాంకు అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉంటుందో తెలుస్తుందని ఒక పోలీసు అధికారి తెలిపారు.

Also Read: Illiterate: రెండో ఎక్కం కూడా రాని వీడిని పెళ్లిచేసుకోను..పీటల మీద పెళ్లి ఆపేసిన వధువు..వరుడికి షాక్!

Etela Rajender: భూకబ్జా ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన జమునా హాచరీస్.. ఇవాళ విచారణకు వచ్చే అవకాశం..