AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగళూరు డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. మాజీ హోంమంత్రి కొడుకు అరెస్ట్

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన అనూప్ తో ఆర్థిక లావాదేవీలు పెట్టుకున్నాడని ఆరోపిస్తూ మాజీ హోమ్ మంత్రి కొడుకును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.

బెంగళూరు డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. మాజీ హోంమంత్రి కొడుకు అరెస్ట్
Balaraju Goud
|

Updated on: Oct 31, 2020 | 3:58 PM

Share

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసు అనేక మలుపులు తిరిగి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోతుంది. డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన అనూప్ తో ఆర్థిక లావాదేవీలు పెట్టుకున్నాడని ఆరోపిస్తూ మాజీ హోమ్ మంత్రి కొడుకును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్‌కు సంబంధించి సీపీఎం కేరళ సెక్రటరీ కొడియేరి బాలకృష్ణన్‌ తనయుడు బినీష్ కొడియేరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. కోర్టు ముందు ఆయనను హాజరుపరచగా నవంబర్ 2 వరకూ ఈడీ కస్టడీకి కోర్టు ఆదేశించింది.

ఈడీ కథనం ప్రకారం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం-2002‌లోని సెక్షన్ 19(1) కింద బినీష్‌ను ఈడీ అరెస్టు చేసింది. బినీష్‌కు అసోసియేట్‌గా మాదకద్రవ్యాల అమ్మకం, కొనుగోలు జరిపేవాడినని ఇటీవల అరెస్టయిన మాదకద్రవ్యాల సరఫరాదారు మొహమ్మద్ అనూప్‌‌ను ఈడీ ఇంటరాగేషన్‌లో వెల్లడించారు. బినీష్‌కు బినామీదారుగా అనూప్ వ్యవహరించే వాడని, అతని ఆర్థిక వ్యవహారాలన్నీ బినీష్ ఆదేశాలతోనే చేసేవాడని, అందుకోసం అనూప్‌కు బినీష్ పెద్ద మొత్తంలో సొమ్ములు ఇచ్చేవాడని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అనూప్ పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్టు ఈడీ తెలిపింది. 1985 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టానెన్స్ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద బెంగళూరుకు చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మహమ్మద్ అనూప్, తదితరులపై ఈడీ విచారణ జరుపుతోంది.