మల్యాల రోడ్డు ప్రమాదం.. మాయమైన బంగారాన్ని 24గంటల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు

Police found missing 2.3 kgs gold: పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యాపారులు మరణించగా.. మరో ఇద్దరు..

మల్యాల రోడ్డు ప్రమాదం.. మాయమైన బంగారాన్ని 24గంటల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు
Follow us

|

Updated on: Feb 24, 2021 | 12:08 PM

Police found missing 2.3 kgs gold: పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యాపారులు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాద సమయంలో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైనట్లు పోలీసులకు భాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మాయమైన బంగారాన్ని 24గంటల్లోనే స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన బంగారం వ్యాపారులు ప్రయాణిస్తున్న కారు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాల ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కొత్త శ్రీనివాస్‌, కొత్త రాంబాబు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో 108 వాహనంలో వీరిని గోదావరిఖనికి తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో బాధితుల వెంట రూ.కోటిపైచిలుకు విలువగల బంగారం ఉంది. ఈ క్రమంలో 108 సిబ్బంది కొంత బంగారాన్ని గుర్తించి రామగుండం ఎస్సైకు అప్పగించారు. దీంతో బాధితుల వద్ద 3 కిలోల 300 గ్రాముల బంగారం లభించినట్లు పోలీసులు ప్రకటించారు. వ్యాపారుల వద్ద ఉన్న మరో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైనట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించారు. నిందితుల నుంచి 2 కిలోల 300 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరికొంతసేపట్లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

Also Read:

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి