AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదుపుతప్పిన మెట్రో క్రేన్.. ఒకరు మృతి, మరొ ఇద్దరికి గాయాలు

ముంబైలోని మెట్రో ఫిల్లర్ లోకి క్రేన్ దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

అదుపుతప్పిన మెట్రో క్రేన్.. ఒకరు మృతి, మరొ ఇద్దరికి గాయాలు
Balaraju Goud
|

Updated on: Oct 31, 2020 | 1:57 PM

Share

ముంబైలోని మెట్రో ఫిల్లర్ లోకి క్రేన్ దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే సమీపంలోని అంధేరి గుండవాలి వద్ద బస్ స్టాప్ సమీపంలో జోగేశ్వరి నుంచి బాంద్రా వైపు వెళ్తున్న మెట్రో క్రేన్ అదుపు తప్పి మెట్రో స్తంభాన్ని ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో ఆ తాకిడి ప్రభావంతో క్రేన్ రెండు భాగాలుగా విడిపోయింది. బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్న ఒక మహిళ క్రేన్ వెనుక చక్రాల కింద చిక్కుకొని అక్కడికక్కడే మరణించింది. సమీపంలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనకు కారణమైన క్రేన్ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.