AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 500కే కొత్త ఎల్ఈడీ టీవీ టీవీ.. ఆరా తీస్తే దిమ్మ తిరిగే షాక్‌.. పోలీసులే కంగుతిన్నారు

ఎవరిదో సొమ్ము..మరెవరో దానం చేసినట్టుంది ఇక్కడి దొంగలపని. కృష్ణా జిల్లాలో విచిత్రమైన దొంగతనం బయటపడింది. 500కే టీవీ అమ్ముతుంటే పోలీసులకు అనుమానం వచ్చింది..

రూ. 500కే కొత్త ఎల్ఈడీ టీవీ టీవీ.. ఆరా తీస్తే దిమ్మ తిరిగే షాక్‌.. పోలీసులే కంగుతిన్నారు
Ram Naramaneni
|

Updated on: Mar 03, 2021 | 9:57 AM

Share

ఎవరిదో సొమ్ము..మరెవరో దానం చేసినట్టుంది ఇక్కడి దొంగలపని. కృష్ణా జిల్లాలో విచిత్రమైన దొంగతనం బయటపడింది. 500కే టీవీ అమ్ముతుంటే పోలీసులకు అనుమానం వచ్చింది.. అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే దిమ్మ తిరిగే విషయాలు బయటపడ్డాయి.

జగ్గయ్యపేట మండలం గౌరవరం హైవేపై 500 రూపాయలకే కొత్త కలర్ టీవీని అమ్మేందుకు ప్రయత్నించారు కొందరు వ్యక్తులు. అంత తక్కువ ధరకు టీవీ విక్రయించేందుకు ప్రయత్నించడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు టీవీ అమ్ముతున్న వారిని పట్టుకున్నారు. అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, రూ. 500 కే ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించగా, అసలు విషయం బయటపెట్టారు కేటుగాళ్లు.

ఎనికేపాడులోని ఓ షోరూమ్‌ నుంచి భీమవరం వెళ్లేందుకు ఎలక్ట్రానిక్ వస్తువుల ఆటోను లోడ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కన్ను ఆ ఆటోపై పడింది.. లోడ్ చేసిన వస్తువుల్ని దొంగిలించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఎనికేపాడులో దొంగిలించి వాటిని ఆటోలో హైదరాబాద్‌ తీసుకుని వెళ్తున్నాడు. గౌరవరం దగ్గరకు రాగానే వస్తువులు తీసుకెళ్తున్న ఆటోలో డీజిల్‌ అయిపోవటంతో టీవీని 500లకు అమ్మి.. ఇందనం వరకు అమౌంట్ సరిపోతుందని భావించాడు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. బేరం ఆడగా 500 రూపాయలకు కూడా టీవీ ఇచ్చేస్తాననడంతో.. వ్యవహారంపై డౌట్ వచ్చి పోలీసులు రంగంలోకి దిగారు.

అప్పటికే షోరూం యజమాని ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు ఫాస్ట్‌ట్రాక్‌ ద్వారా వాహనాన్ని ట్రాక్‌ చేశారు. పట్టుబడిన వారి నుంచి 9 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విజయవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దర్జాగా దొంగతనం చేసి.. హైదరాబాద్ వస్తువులు తీసుకెళ్తున్న వైనం చూసి పోలీసులు షాక్ తిన్నారు. ఎక్కువగా యూపీ, బీహార్‌కకు చెందిన దొంగలే ఇలాంటి దొంగతనాలు చేస్తారని.. వారిని పట్టుకుని జైల్లో వేసినా మార్ప రావడం రాలేదని.. మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

Thives-Arrested

Also Read:

ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు

Bumrah wedding: పెళ్లి కళ వచ్చేసింది..! అందుకే మ్యాచ్‌లకు దూరం.. పూర్తి వివరాలు ఇవే

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..