ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు

ఒకటి కాదు రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు. గుడ్లు నుంచి ఒక్కొక్కటిగా వస్తూ జనాన్ని బెంబేలెత్తించాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు... కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు
Follow us

|

Updated on: Mar 03, 2021 | 9:59 AM

ఒకటి కాదు రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు. గుడ్లు నుంచి ఒక్కొక్కటిగా వస్తూ జనాన్ని బెంబేలెత్తించాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఒక్క పాము చూస్తేనే చెమటలు పట్టేస్తాయి. అలాంటిది పదుల సంఖ్యలో చూస్తే… అమ్మో గుండెజారి గల్లంతవ్వాల్సిందే. అలాంటి సంఘటనే జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామంలో వెలుగు చూసింది. వెంకటాపురం బస్టాండ్‌ మెయిన్‌రోడ్డులో మంగలి లక్ష్మన్న బంక్‌ వద్ద ఈ దృశ్యాన్ని చూసిన వాళ్లంతా ఒక్కసారిగా బెదిరిపోయారు. బంకు ముందర భూమిలో మిషన్‌ భగీరథ నీళ్ల పైప్‌ లైన్‌ ఉంది. అందులో ఉన్న చిన్న హోల్‌ నుంచి ఓ పాము వచ్చింది. దీన్ని స్థానికులు చంపేశారు. ఇంతలో ఆ కలుగు నుంచి మరో స్నేక్‌ వచ్చింది. దాన్ని కూడా కొట్టి చంపేశారు. ఆ రంధ్రం నుంచి ఇక పాములు వరుస కట్టి వస్తూనే ఉన్నాయి.

దీంతో బెదిరిపోయి స్థానికులకు ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. పాము గుడ్లు నుంచి ఒక్కొక్కటిగా పిల్లులు బయటపడటం చూసి ఆశ్చర్యపోయారు. కాసేపు అలా వాటిని చూస్తూ ఉండిపోయారు. సుమారు ఇరవై నుంచి పాతిక పాములు బయటకు వచ్చాయి. వాటన్నింటినీ చంపేసి పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి కాల్చేశారు. అక్కడే ఉన్న కొందరు యువకులు ఈ సీన్స్‌ను సెల్‌ఫోన్‌లో షూట్‌ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది.

అయితే పాములను చంపడంపై జంతు ప్రేమికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలా పాములు కనిపిస్తే.. స్నేక్ క్యాచర్స్ లేదా పారెస్ట్ డిపార్ట్‌మెంట్  వారికి సమాచారం ఇవ్వాలి కానీ..  చంపడం సరికాదు అంటున్నారు. వాటిని చంపడమే కాకుండా వీడియోలో తీసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం దారుణమన్నారు. అయితే స్థానికుల వెర్షన్ మాత్రం వేరే ఉంది. అది నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమని.. అలాంటి చోట ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండేందుకే వాటిని చంపేశామని చెబుతున్నారు.

Also Read:

Vijay Hazare: దుమ్ములేపిన సెహ్వాగ్ మేనల్లుడు.. బౌండరీల వర్షం.. కానీ జట్టును గెలిపించలేకపోయాడు

Doctors big Mistake: యువకుడు చనిపోయాడని చెప్పిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు.. పోస్ట్‌మార్టం రూమ్‌కి తీసుకెళ్లగా..