యువకుడిని చంపి పాతిపెట్టిన దుండగులు..!
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. నందిగామ మండలం మునగచర్లకు చెందిన గంటా నవీన్ దారుణ హత్యకు గురయ్యాడు. గత సోమవారం నుంచి కనిపించకుండా పోయిన నవీన్ మునగచర్ల సమీపంలో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. నందిగామ మండలం మునగచర్లకు చెందిన గంటా నవీన్ దారుణ హత్యకు గురయ్యాడు. గత సోమవారం నుంచి కనిపించకుండా పోయిన నవీన్ మునగచర్ల సమీపంలో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఓ యూట్యూబ్ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్న నవీన్.. ఇంటిని నుంచి బయటకు వెళ్లిన తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, గత కొంతకాలంగా స్థానికంగా ఉండే సాయి, రమణకు గంటా నవీన్ తో వ్యక్తి గత గొడవలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో ముగ్గురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో సాయి, రమణ రాయితో కొట్టడంతో నవీన్ అక్కడికక్కడే కుప్పకూలాడు. దీంతో మృతదేహాన్ని మునగచర్ల శివారులో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.