AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: విద్యార్థులతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసులు.. ఫేక్‌ సర్టిఫికేట్లపై సీపీ ఆనంద్‌ వార్నింగ్‌..

Hyderabad: నకిలీ సర్టిఫికేట్ల దందాతో ఉన్నత విద్యా మండలి భ్రష్టు పట్టిపోయిందని హైదరాబాద్‌ సీపీ, సీవీ ఆనందర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకీ పెరిగిపోతున్న నకిలీ ఎడ్యుకేషన్‌ సర్టిఫికేషన్ల విషయమై మంగళవారం మీడియాతో మాట్లాడిన సీపీ..

Hyderabad: విద్యార్థులతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసులు.. ఫేక్‌ సర్టిఫికేట్లపై సీపీ ఆనంద్‌ వార్నింగ్‌..
Hyderabad
Narender Vaitla
|

Updated on: Feb 15, 2022 | 4:34 PM

Share

Hyderabad: నకిలీ సర్టిఫికేట్ల దందాతో ఉన్నత విద్యా మండలి భ్రష్టు పట్టిపోయిందని హైదరాబాద్‌ సీపీ, సీవీ ఆనందర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకీ పెరిగిపోతున్న నకిలీ ఎడ్యుకేషన్‌ సర్టిఫికేషన్ల విషయమై మంగళవారం మీడియాతో మాట్లాడిన సీపీ పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మలక్‌పేటలోని శ్రీసాయి ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారు. విద్యార్థులు నకిలీ సర్టిఫికేట్ల కొనుగోలు వ్యవహారం తమ తల్లిదండ్రులకు తెలిసే జరుగుతోంది. ఒక్కో డిగ్రీకి ఒక్కో రేటు చొప్పున అక్రమ దందా నడుస్తోంది’ అని ఆనంద్ తెలిపారు.

దొంగ సర్టిఫికేట్ల దందా భరతం పట్టేందుకు పోలీసు శాఖ చేస్తున్న కృషి విషయమై ఆనంద్‌ మాట్లాడుతూ.. ‘భోపాల్‌లోని ఎస్‌ఆర్కే యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేతన్‌ సింగ్‌ని అరెస్ట్‌ చేశాం. నకిలీ సర్టిఫికెట్‌ల తయారీలో దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ పనిచేస్తోంది. దీనిని చేధించడానికి ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్‌)ను ఏర్పాటు చేస్తున్నాం. దొంగ సర్టిఫికేట్ల దందా చేస్తున్న ముఠాకు యూనివర్సిటీలో ఉండే కొందరు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్‌ కొనుగోలు చేసిన ఏడుగురు విద్యార్థులను అరెస్ట్‌ చేశా’మని చెప్పుకొచ్చారు.

ఇక విద్యార్థులు నకిలీ సర్టిఫికేట్ల కొనుగోలు తమ తల్లిదండ్రులకు తెలిసే జరుగుతుందని ఆనంద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు నకిలీ సర్టిఫికేట్‌లు తీసుకుంటే తల్లిదండ్రులను కూడా వదిలి పెట్టమని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. కొందరు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అలుసుగా తీసుకుంటున్నారని, డ్రగ్స్‌, ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ విషయంలో కఠినంగా ఉంటామని తేల్చిచెప్పారు.

Also Read: Bjp vs Trs: ముఖ్యమంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇలాంటి పరిస్థితి కొత్తగా చూస్తున్నామంటూ..

Medaram Maha Jatara 2022: మేడారం జాతరలో ప్రతీది అద్భుతమే! మహిమాన్వితమే! మార్మికమే!

blueberries బ్లూ బెర్రీలు ఎన్నో పోషకాలకు నిలయం.. దీని జ్యూస్ వృద్ధులకు ఓ వరం